ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది. అనుష్క, నయనతారల తర్వాత తనకంటూ ఒక ఇమేజ్, మార్కెట్ సంపాదించుకున్న అరుదైన కథానాయికల్లో ఆమె ఒకరు. ఐతే కథానాయికలు మరీ ఎక్కువ కాలం టాప్లో కొనసాగడం కష్టం. వయసు పెరిగి, గ్లామర్ తగ్గాక కెరీర్ డౌన్ అవుతుంది.
పైగా సమంత పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్ కావడం.. తర్వాత విడాకులు తీసుకోవడం.. అనారోగ్యం పాలవడంతో కెరీర్కు అనుకున్నట్లుగా ముందుకు సాగలేదు. ముఖ్యంగా విడాకులు, అనారోగ్యం వల్ల సమంత తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కోవడంతో ఒక దశలో సమంత లుక్స్ కూడా దెబ్బ తిన్న మాట వాస్తవం. ఆమె ఒక రకమైన వేదనలో కనిపించడం అభిమానులను ఎంతో బాధించింది.
ఐతే అనారోగ్యం నుంచి కోలుకోవడంతో పాటు మళ్లీ కొత్త తోడును వెతుక్కోవడం.. ఇటీవలే రాజ్ నిడిమోరును పెళ్లి కూడా చేసుకోవడంతో సమంతలో మళ్లీ జోష్ వచ్చింది. పెళ్లి తర్వాత సామ్ తొలిసారిగా రాజ్తో కలిసి తాజాగా పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఈ సందర్భంగా సమంతను చూసి అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. సమంత ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్న సంగతి స్పష్టంగా కనిపించింది. తన ముఖంలో మునుపటి గ్లో వచ్చింది.
వ్యక్తిగత జీవితంలో జరిగే పరిణామాలు మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పడానికి సమంతనే ఉదాహరణ. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉన్న విషయం ముఖంలో ప్రతిబింబిస్తోంది. సామ్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతుండడం కూడా అభిమానులకు ఆనందాన్నిస్తోంది.
ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇటీవలే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సక్సెస్ అయి సమంతలో మరింత ఆనందాన్ని నింపాలని అభిమానులు కోరుకుంటున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…