ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది. అనుష్క, నయనతారల తర్వాత తనకంటూ ఒక ఇమేజ్, మార్కెట్ సంపాదించుకున్న అరుదైన కథానాయికల్లో ఆమె ఒకరు. ఐతే కథానాయికలు మరీ ఎక్కువ కాలం టాప్లో కొనసాగడం కష్టం. వయసు పెరిగి, గ్లామర్ తగ్గాక కెరీర్ డౌన్ అవుతుంది.
పైగా సమంత పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్ కావడం.. తర్వాత విడాకులు తీసుకోవడం.. అనారోగ్యం పాలవడంతో కెరీర్కు అనుకున్నట్లుగా ముందుకు సాగలేదు. ముఖ్యంగా విడాకులు, అనారోగ్యం వల్ల సమంత తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కోవడంతో ఒక దశలో సమంత లుక్స్ కూడా దెబ్బ తిన్న మాట వాస్తవం. ఆమె ఒక రకమైన వేదనలో కనిపించడం అభిమానులను ఎంతో బాధించింది.
ఐతే అనారోగ్యం నుంచి కోలుకోవడంతో పాటు మళ్లీ కొత్త తోడును వెతుక్కోవడం.. ఇటీవలే రాజ్ నిడిమోరును పెళ్లి కూడా చేసుకోవడంతో సమంతలో మళ్లీ జోష్ వచ్చింది. పెళ్లి తర్వాత సామ్ తొలిసారిగా రాజ్తో కలిసి తాజాగా పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఈ సందర్భంగా సమంతను చూసి అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. సమంత ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్న సంగతి స్పష్టంగా కనిపించింది. తన ముఖంలో మునుపటి గ్లో వచ్చింది.
వ్యక్తిగత జీవితంలో జరిగే పరిణామాలు మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పడానికి సమంతనే ఉదాహరణ. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉన్న విషయం ముఖంలో ప్రతిబింబిస్తోంది. సామ్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతుండడం కూడా అభిమానులకు ఆనందాన్నిస్తోంది.
ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇటీవలే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సక్సెస్ అయి సమంతలో మరింత ఆనందాన్ని నింపాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…