Political News

మోడీలో ఓటమిభయం పెరిగిపోతోందా ?

నరేంద్రమోడీలో ఓటమిభయం పెరిగిపోతున్నట్లుంది. అందుకనే వరసబెట్టి నిత్యావసరాల ధరలు తగ్గిస్తున్నారు. ఇంతకాలం జనాల నడ్డివిరుస్తు అన్నింటి ధరలను ఆకాశానికి పెంచేసిన మోడీ ప్రభుత్వంకు ఇపుడు హఠాత్తుగా జనాల ఇబ్బందులు గుర్తుకొస్తున్నాయి. రాఖీపౌర్ణమి సందర్భంగా వంటగ్యాస్ సిలిండర్ ధర 200 రూపాయలు తగ్గించటమే ఇందుకు నిదర్శనం. అలాగే పేదలు వాడే ఉజ్వల్ పథకంలోని గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 400 రూపాయలు తగ్గింది.

వంటగ్యాస్ ధరలు తగ్గించటం వల్ల సుమారు 36 కోట్లమంది వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తొందరలోనే పెట్రోల్, డీజల్ ధరలు తగ్గుతాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించటం వల్ల మరో 100 కోట్లమందికి లాభం జరుగుతుందని అనుకోవటంలో తప్పులేదు. ఎలాగంటే పెట్రోల్, డీజల్ ధరలు తగ్గింపు వల్ల అనేక నిత్యావసరాల ధరలు తగ్గుతాయని అందరికీ తెలిసిందే.

ప్రతి నిత్యావసర వస్తువు ధరలోను పెట్రోల్, డీజల్ ధరలు కలిసే ఉంటాయని తెలిసిందే. ముఖ్యంగా రవాణా ఛార్జీల మోత ఎక్కువగా ఉంటుంది. అలాగే పెట్రోల్, డీజల్ ధరల్లో ఎక్సైజ్ పన్నులు కలిసే ఉంటాయి. ఇలా అడుగుడుగునా అన్నీ ధరలు కలిసి చివరకు నిత్యావసరాల ధరలను ఆకాశానికి తీసుకెళతాయి. అదే పెట్రోల్, డీజల్ ధరలు తగ్గిస్తే ఆటోమేటిగ్గా అన్నింటిపైన వసూలు చేస్తున్న పన్నులు తగ్గి వాటి అసలు ధరలు తగ్గుతాయి. ఇపుడు సడెన్ గా మోడీకి జనాల బాధలు ఎందుకు గుర్తుకొచ్చాయి.

ఎందుకంటే తొందరలో జరగబోయే ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కారణమని చెప్పాలి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కష్టమంటున్నారు. నిజంగానే బీజేపీ ఓడిపోతే దాని ప్రభావం ఆ తర్వాత జరగబోయే పార్లమెంటు ఎన్నికలపైనా పడుతుంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేకొద్దీ బీజేపీకి ముందుగా సమస్య ఎదురయ్యేది రాజ్యసభలోనే. తర్వాత లోక్ సభలో కూడా దాని ప్రభావం పడుతుంది. అందుకనే ఓటమిభయంతోనే గ్యాస్ ధరలు తగ్గించి పెట్రోల్, డీజల్ ధరలు తగ్గింపనే సంకేతాలను పంపుతున్నారు నరేంద్రమోడీ.

Satya

Recent Posts

వైసీపీ మెడకే చుట్టుకున్న వైఎస్ విగ్రహ ధ్వంసం!

ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో సెలవు దినం ఆదివారం రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో…

2 hours ago

ఓవర్సీస్ ప్లానింగ్ ఇలా ఉండాలి

గత కొన్నేళ్లుగా నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఓవర్సీస్ ప్రీమియర్లు. టైంకి డేటా పంపలేకపోవడం, హార్డ్ డిస్క్ రవాణాలో…

2 hours ago

జగన్ గొడ్డలి కంటే ఎక్కువ: సజ్జల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవలి మహానాడులో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…

3 hours ago

మంగాపురం వైపు దృష్టి మళ్లుతోంది

ఘట్టమేనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న జయకృష్ణ మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్…

4 hours ago

రామ్ చరణ్ చేతిలో 7 చీలికలు

తన సినిమాల్లో పాత్రల కోసం శారీరకంగా ఎంత కష్టానికైనా వెనుకాడని కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ధృవ,…

4 hours ago

ఇవి క్లిక్ అయితే… నారా హీరో ఫుల్ బిజీనే

ఏమాత్రం సినీ నేపథ్యం లేని నారా కుటుంబం నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రోహిత్. నారా అంటే పక్కా పొలిటికల్…

5 hours ago