Political News

లోకేష్ పాదయాత్ర చూసి ఏడ్చాను:భువనేశ్వరి

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన తండ్రి నారా చంద్రబాబునాయుడు, తల్లి నారా భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుని పాదయాత్రను లోకేష్ మొదలుబెట్టారు. ఆ సమయంలో నారా భువనేశ్వరి..లోకేష్ పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆశీర్వదించి పంపించారు. ఆ తర్వాత లోకేష్ పాదయాత్రలో భువనేశ్వరి కూడా ఒకరోజు పాల్గొన్నారు. అయితే ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడలేదు. కానీ, తాజాగా కుప్పంలో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడిన భువనేశ్వరి…లోకేష్ పాదయాత్రపై స్పందించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. లోకేష్ పాదయాత్ర చేయాలని సంకల్పించిన సమయంలో తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని భువనేశ్వరి అన్నారు. తన తనయుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్న తరుణంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఆమె వెల్లడించారు. అయితే, పాదయాత్ర చేస్తున్న కొద్దీ లోకేష్ రాటుదేలాడని, అది తనకు సంతోషాన్నిచ్చిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కోసం, ప్రజల కోసం తమ కుటుంబం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుందని భువనేశ్వరి ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి ఎన్టీఆర్ పేరిట రూ.100 స్మారక నాణఎం విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. నాణెం విడుదలకు కృషిచేసిన అక్క పురందేశ్వరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. కుప్పంలో పర్యటిస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ సంజీవిని ఉచిత వైద్యశాలను ప్రారంభించిన భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on August 30, 2023 6:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

57 minutes ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

5 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

6 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

6 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

7 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

7 hours ago