Political News

బీజేపీతో పొత్తుపై తేల్చేసిన చంద్రబాబు

ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీకి అతిపెద్ద సమస్య జగన్ అని, విభజన గాయాల కంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసిన గాయమే ఎక్కువ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ విధానాల వల్లే తెలంగాణకు, ఆంధ్రకు అభివృద్ధిలో పొంతన లేకుండా పోయిందని దుయ్యబట్టారు. తాను గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదని, ఆ పార్టీ టిడిపిగా మారిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక, బీజేపీతో పొత్తులపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బిజెపితో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నాం అనే విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. తాను చూడని రాజకీయం లేదని, దేశ నిర్మాణంలో భాగం కావడమే తన ఉద్దేశమని అన్నారు. అది ఏ విధంగా, ఎలా అనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇక, తెలంగాణలో బీజేపీతో పొత్తులు లేవని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఆ పార్టీతో కలిసి వెళ్లేందుకు సమయం మించిపోయిందని, తెలంగాణలో టిడిపి ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చంద్రబాబు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని, హోదా ఏపీ ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు.

ప్రత్యేక హోదా విషయంలోనే కేంద్రంతో తాను విభేదించానని మిగతా విషయాలలో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని క్లారిటీని ఇచ్చారు ఇదే విషయాన్ని తన గతంలో చాలా సార్లు చెప్పానని చంద్రబాబు అన్నారు.టిడిపి జాతీయభావంతో ఉండే పార్టీ అని, జాతీయ రాజకీయాలతో టీడీపీకి ఎల్లప్పుడూ ప్రత్యేక అనుబంధం ఉంటుందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై కమిటీ ఏర్పాటు చేశామని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏడుగురు సభ్యులతో చంద్రబాబు కమిటీని నియమించిన సంగతి తెలిసింది. ఏపీని ఎలా పునర్మించాలి అనే ఆలోచనతో ఉన్నానని చంద్రబాబు అన్నారు.

This post was last modified on August 30, 2023 11:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

1 hour ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago