ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు గతంలో అధికార పార్టీని పలుమార్లు ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. తెలిసి అంటారో…తెలియక అంటారో తెలియదుగానీ…ధర్మాన మాత్రం స్వపక్షంలో విపక్షం మాదిరిగా వైసీపీ ప్రభుత్వం గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి సొంత ప్రభుత్వంపై, పార్టీ నాయకత్వంపై ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పార్టీ అధిష్టానంపై, పార్టీ నాయకత్వంపై వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని ధర్మాన అంగీకరించారు. ఇక, వైసీపీ నేతలు చెప్పిన వారికే వాలంటీర్ల పోస్టులు ఇచ్చామని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్న సదుద్దేశ్యంతోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను జగన్ ప్రవేశ పెట్టారని చెప్పుకొచ్చారు. దీంతో, తమ చేతిలో ఉన్న అధికారాలను కూడా తీసేశారన్న ఆవేదన, బాధ, కార్యకర్తల్లో ఉందన్నది వాస్తవమేనని ధర్మాన అంగీకరించారు. కానీ, కార్యకర్తలు ఇలాంటి అభిప్రాయంతో ఉంటే పార్టీపై ప్రజలలో తప్పుడు భావం ఏర్పడుతుందని, పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలని కార్యకర్తలకు మంత్రి హితవు పలికారు. పార్టీలో అందరికీ సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు ధర్మాన సూచించారు.
శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే, ధర్మాన చేసిన వ్యాఖ్యలలో తప్పేమీ లేదని, ఇదే అభిప్రాయం చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు, కార్యకర్తలలో సైతం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కాకపోతే ధర్మాన కాస్త ఓపెన్ గా బయటపడ్డారని, అందుకే ఆయనను తప్పుబట్టాల్సిన అవసరం లేదని నెటిజన్లు అంటున్నారు. ఎమ్మెల్యేల కన్నా వాలంటీర్ల మాట ఎక్కువ చెల్లుబాటవుతోందన్న భావన చాలా మంది వైసీపీ నేతలలో ఉందని, అందుకే వాలంటీర్లు వ్యవస్థ పై వైసీపీ నేతలు సైతం గుర్రుగా ఉన్నారని నెటిజన్లు అంటున్నారు.
This post was last modified on August 30, 2023 1:03 am
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…
కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…
స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తెలంగాణలో టికెట్ల ధరలు ఎలా ఉంటాయన్నది గత…