Political News

హైదరాబాదులో ఛాయిస్.. ఢిల్లీలో ఫైనల్

తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఇంకా షెడ్యూల్ విడుదల కానప్పటికీ అభ్యర్థుల ప్రకటన, దరఖాస్తుల ప్రక్రియ, చేరికలు అంటూ పార్టీలన్నీ హడావుడి చేస్తున్నాయి. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. రేసులో ముందుంది. ఇక అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. టికెట్లు ఆశించే వాళ్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పుడు వీటిని వడబోసే కార్యక్రమం మొదలైంది. మొదట తెలంగాణలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి ఒక్కో సీటుకు ముగ్గురిని ఎంపిక చేయనుంది. ఆ తర్వాత ఢిల్లీలోని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది అభ్యర్థులను ఖరారు చేస్తే.. అధిష్ఠానం జాబితా ప్రకటిస్తుంది.

తెలంగాణలోని 119 ఎమ్మెల్యే స్థానాలకు గాను కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 1,025 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. వీటిలో 34 స్థానాలకు 10కి పైగా దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇల్లెందు నియోజకవర్గంలో టికెట్ కోసం అత్యధికంగా 34 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పుడీ దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియలో తెలంగాణలోని ప్రదేశ్ ఎన్నికల కమిటీ మునిగిపోయింది. ఆయా నియోజకవర్గంలోని నేతల బలాబలాలు, అక్కడి పరిస్థితి, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది.. ఇలా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక్కో సీటుకు గరిష్ఠంగా ముగ్గురిని ఈ కమిటీ ఎంపిక చేస్తుందని సమాచారం.

ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి, త్వరలోనే జాబితా పంపించాలని అధిష్ఠానం నుంచి టీపీసీసీకి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఈ జాబితా తయారైన తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ రంగంలోకి దిగుతుంది. ఆ ముగ్గురు అభ్యర్థుల పరిస్థితిని అంచనా వేసి ఇందులో నుంచి ఒకరిని ఎంపిక చేస్తుంది. అధిష్ఠానం దీనికి ఆమోద ముద్ర వేసి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. వచ్చే నెల 15 నాటికి 75 స్థానాల వరకూ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసింది. సెప్టెంబర్ చివరి కల్లా మొత్తం సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.

This post was last modified on August 29, 2023 3:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

58 minutes ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

5 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

6 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

7 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

7 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

7 hours ago