Political News

హైదరాబాదులో ఛాయిస్.. ఢిల్లీలో ఫైనల్

తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఇంకా షెడ్యూల్ విడుదల కానప్పటికీ అభ్యర్థుల ప్రకటన, దరఖాస్తుల ప్రక్రియ, చేరికలు అంటూ పార్టీలన్నీ హడావుడి చేస్తున్నాయి. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. రేసులో ముందుంది. ఇక అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. టికెట్లు ఆశించే వాళ్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పుడు వీటిని వడబోసే కార్యక్రమం మొదలైంది. మొదట తెలంగాణలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి ఒక్కో సీటుకు ముగ్గురిని ఎంపిక చేయనుంది. ఆ తర్వాత ఢిల్లీలోని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది అభ్యర్థులను ఖరారు చేస్తే.. అధిష్ఠానం జాబితా ప్రకటిస్తుంది.

తెలంగాణలోని 119 ఎమ్మెల్యే స్థానాలకు గాను కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 1,025 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. వీటిలో 34 స్థానాలకు 10కి పైగా దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇల్లెందు నియోజకవర్గంలో టికెట్ కోసం అత్యధికంగా 34 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పుడీ దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియలో తెలంగాణలోని ప్రదేశ్ ఎన్నికల కమిటీ మునిగిపోయింది. ఆయా నియోజకవర్గంలోని నేతల బలాబలాలు, అక్కడి పరిస్థితి, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది.. ఇలా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక్కో సీటుకు గరిష్ఠంగా ముగ్గురిని ఈ కమిటీ ఎంపిక చేస్తుందని సమాచారం.

ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి, త్వరలోనే జాబితా పంపించాలని అధిష్ఠానం నుంచి టీపీసీసీకి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఈ జాబితా తయారైన తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ రంగంలోకి దిగుతుంది. ఆ ముగ్గురు అభ్యర్థుల పరిస్థితిని అంచనా వేసి ఇందులో నుంచి ఒకరిని ఎంపిక చేస్తుంది. అధిష్ఠానం దీనికి ఆమోద ముద్ర వేసి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. వచ్చే నెల 15 నాటికి 75 స్థానాల వరకూ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసింది. సెప్టెంబర్ చివరి కల్లా మొత్తం సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.

This post was last modified on August 29, 2023 3:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖైదీ 2 ఇక ఎప్పటికీ రాదేమో

దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…

25 minutes ago

అఖండ తాండవానికి అదొక్కటే సమస్య

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…

2 hours ago

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

2 hours ago

బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…

2 hours ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

4 hours ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

4 hours ago