Political News

హైదరాబాదులో ఛాయిస్.. ఢిల్లీలో ఫైనల్

తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఇంకా షెడ్యూల్ విడుదల కానప్పటికీ అభ్యర్థుల ప్రకటన, దరఖాస్తుల ప్రక్రియ, చేరికలు అంటూ పార్టీలన్నీ హడావుడి చేస్తున్నాయి. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. రేసులో ముందుంది. ఇక అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. టికెట్లు ఆశించే వాళ్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పుడు వీటిని వడబోసే కార్యక్రమం మొదలైంది. మొదట తెలంగాణలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి ఒక్కో సీటుకు ముగ్గురిని ఎంపిక చేయనుంది. ఆ తర్వాత ఢిల్లీలోని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది అభ్యర్థులను ఖరారు చేస్తే.. అధిష్ఠానం జాబితా ప్రకటిస్తుంది.

తెలంగాణలోని 119 ఎమ్మెల్యే స్థానాలకు గాను కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 1,025 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. వీటిలో 34 స్థానాలకు 10కి పైగా దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇల్లెందు నియోజకవర్గంలో టికెట్ కోసం అత్యధికంగా 34 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పుడీ దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియలో తెలంగాణలోని ప్రదేశ్ ఎన్నికల కమిటీ మునిగిపోయింది. ఆయా నియోజకవర్గంలోని నేతల బలాబలాలు, అక్కడి పరిస్థితి, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది.. ఇలా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక్కో సీటుకు గరిష్ఠంగా ముగ్గురిని ఈ కమిటీ ఎంపిక చేస్తుందని సమాచారం.

ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి, త్వరలోనే జాబితా పంపించాలని అధిష్ఠానం నుంచి టీపీసీసీకి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఈ జాబితా తయారైన తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ రంగంలోకి దిగుతుంది. ఆ ముగ్గురు అభ్యర్థుల పరిస్థితిని అంచనా వేసి ఇందులో నుంచి ఒకరిని ఎంపిక చేస్తుంది. అధిష్ఠానం దీనికి ఆమోద ముద్ర వేసి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. వచ్చే నెల 15 నాటికి 75 స్థానాల వరకూ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసింది. సెప్టెంబర్ చివరి కల్లా మొత్తం సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.

This post was last modified on August 29, 2023 3:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

11 minutes ago

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

31 minutes ago

స్లమ్ డాగ్ మేలుకుంటే బాగుండేది

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…

7 hours ago

చరణ్ క్లారిటీ ఇస్తేనే చిరు బయటపడేది

మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…

8 hours ago

ఫ్రెష్షుగా టార్గెట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్

స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…

9 hours ago

అలాంటి మ్యాజిక్.. ఇంకోసారి సాధ్యమేనా?

గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…

10 hours ago