వివిధ పరిణామాల కారణంగా తెలంగాణాలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ అభ్యర్ధుల ప్రకటన తర్వాత మరింత స్పీడుగా పడిపోతోంది. రెండు వారాల్లోనే 3 శాతం మద్దతు పడిపోయింది. అన్నీపార్టీలకన్నా ముందుగా అభ్యర్ధులను ప్రకటించాలని కేసీయార్ అనుకున్నారు. దీనివల్ల చాలా లాభాలున్నాయనే అలా డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే 119 నియోజకవర్గాల్లో 115 మంది అభ్యర్ధులను ప్రకటించేశారు. అయితే అలా ప్రకటించటమే ముందుముదు చాలా మైనస్ అయ్యేట్లుగా ఉందని ఇపుడు అనిపిస్తోంది.
ఎలాగంటే కేసీయార్ ప్రకటించి అభ్యర్ధుల్లో చాలామంది మీద జనాల్లో కాదు కదా ముందు పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత కనబడుతోంది. అభ్యర్ధులకు, ఆశావహులకు ఏమాత్రం పొత్తు కుదరటంలేదు. ఇంతముందుగా అభ్యర్ధులను ప్రకటించటంలో కేసీయార్ లక్ష్యాలు రెండున్నాయి. మొదటిదేమో పార్టీలో అసంతృప్తులను మెల్లిగా దగ్గరకు చేర్చుకోవటం. రెండోది ప్రచారం చేసుకోవటానికి కావాల్సినంత సమయం ఉండటం. రెండో లక్ష్యం మాటేమిటో కానీ మొదటిది మాత్రం పూర్తిగా వికటిస్తోందనే అనిపిస్తోంది.
తెలంగాణా ఇంటెన్షన్స్ అనే సంస్ధ నిర్వహించిన సర్వేలో 51 శాతం మంది కేసీయార్ పాలనపై తీవ్రమైన వ్యతిరేకత చూపారట. అలాగే అంతకుమించి అభ్యర్ధులపై వ్యతిరేకంగా మండిపడుతున్నారట. పాజిటివ్ గా ఉన్నది కేవలం 38 శాతం జనాలే అని తేలింది. రు. 99,999 లోపున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేసినా రైతుల్లో సానుకూలత కనిపించటంలేదు. ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికిప్పుడు కేసీయార్ హడావుడిగా రుణమాఫీ చేశారు.
నిజానికి ఇపుడు చేసిన మాఫీ ఎప్పుడో అవ్వాల్సింది. ఇన్ని సంవత్సరాలు రుణమాఫీ కాకపోవటంతో బ్యాంకులు రైతులను పీల్చి పిప్చిచేసేశాయి. అలాగే లక్షరూపాయల పైన ఉన్న రుణాలను మాఫీచేయలేదు. లక్ష రూపాయలకు పైగా రుణాలున్న రైతులు సుమారు 20 లక్షలమందున్నారు. మరి వీళ్ళ రుణాల మాఫీ ఎప్పుడో తెలీదు. బీజేపీకి సైతం 3.5 శాతం ఆదరణ తగ్గిపోయిందని తేలింది. కాంగ్రెస్ కు మాత్రం స్వలంగా అంటే సుమారు 2 శాతం ఆదరణ పెరిగింది. మరి ముందుముందు బీఆర్ఎస్ పరిస్ధితి ఏమిటో మరింత స్పష్టం కాబోతోంది సర్వేల్లో.
This post was last modified on August 29, 2023 2:52 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…