మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు అంటే కేసీయార్ భయపడుతున్నారా ? అందుకనే ఆయనపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవటానికి వెనకాడుతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. మల్కాజ్ గిరిలో తనకు మెదక్ లో తన కొడుక్కి ఎంఎల్ఏ టికెట్లు కావాలని మొదటినుండి మైనంపల్లి పట్టుబడుతున్నారు. అయితే అందుకు కేసీయార్ అంగీకరించలేదు. మొదటినుండి చెబుతున్నట్లే మల్కాజ్ గిరిలో మాత్రమే మైనంపల్లికి టికెట్ ఇచ్చారు. దాంతో హనుమంతరావు అలిగారు. తన కొడుక్కి టికెట్ రాకపోవటానికి మంత్రి హరీష్ రావే కారణమని ఆరోపణలు చేస్తున్నారు.
తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేసేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు. కేసీయార్ టికెట్లు ప్రకటించినప్పటినుండి మైనంపల్లి పార్టీ ఆఫీసులోకి అడుగు కూడా పెట్టలేదు. పార్టీలో నేతలతో టచ్ లో కూడా లేరు. దాంతో మైనంపల్లి టికెట్ తీసుకున్నారా లేదా అన్నది సస్పెన్సులో పడింది. ఈలోగా కేసీయార్ కూడా ఇద్దరు ముగ్గురు నేతలను మైనంపల్లితో రాయబారానికి పంపితే ఆయన అంగీకరించలేదట.
దాంతో తాజా పరిస్ధితులను భేరీజువేసుకున్న బీజేపీ నేతలు మైనంపల్లితో టచ్ లోకి వెళ్ళారట. ఇద్దరికీ టికెట్లిస్తామని ప్రతిపాదించారట. అయితే కమలంపార్టీలోకి వెళ్ళే విషయమై ఎంఎల్ఏ పెద్దగా సానుకూలంగా లేరని సమాచారం. ఆయన చూపంతా కాంగ్రెస్ మీదుంది. అయితే కాంగ్రెస్ కూడా రెండు టికెట్లిచ్చే పరిస్ధితిలో లేదు. దాంతో ఏమిచేయాలనే విషయంలో పూర్తిగా అయోమయం పెరిగిపోతోంది. బీఆర్ఎస్ లో కొడుక్కి టికెట్ రాదన్నది ఖాయమైపోయింది.
బీజేపీలో ఇస్తామని చెబుతున్నా మైనంపల్లి అటువైపు చూడటంలేదు. కాంగ్రెస్ వైపు చూస్తున్నా ఇక్కడా రెండు టికెట్లు అనుమానమే. మరీ పరిస్ధితుల్లో మైనంపల్లి ఏమిచేయబోతున్నారు ? అన్నది సస్పెన్సుగా మారిపోయింది. మైనంపల్లిని బుజ్జగించాలని కేసీయార్ అనుకోవటం వెనుక పెద్ద కతే ఉందట. అదేమిటంటే మైనంపల్లి పార్టీకి దూరమైతే చుట్టుపక్కల మరో మూడు నియోజకవర్గాల్లో దాని ఎఫెక్ట్ పడుతుందని కేసీయార్ భయపడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే రెండో టికెట్ ఇవ్వకుండా, పార్టీని వీడకుండా మైనంపల్లిని బుజ్జగించే బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించారట. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…