విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సౌత్ సైడ్ ఒక బస్సు షెల్టర్ కొత్తగా నిర్మించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి ఈ మోడరన్ బస్ షెల్టర్ ను ఐదు రోజుల క్రితమే అట్టహాసంగా ప్రారంభించారు. ఈ మోడరన్ బస్ షెల్టర్ కం బస్ బేకు 40 లక్షల రూపాయలు వెచ్చించారు. అయితే, పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఈ బస్సు షెల్టర్ కుంగిపోయి ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో, నాసిరకం నిర్మాణం చేపట్టిన ప్రభుత్వంపై జనసేనచ సిపిఎం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బస్ షెల్టర్ నిర్మాణ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సిపిఎం, జనసేన కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.
జీవీఎంసీ కార్యాలయం ముందు కట్టిన బస్ షెల్టర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, మిగతా వాటి పరిస్థితి ఏంటని వారు నిలదీస్తున్నారు. ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని, ఇలా నాలుగు రోజులకే బస్సు షెల్టర్ కూలిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆ కుంగిపోయిన బస్సు షెల్టర్ ముందు జనసేన, సిపిఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బస్ షెల్టర్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన వారిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పరిపాలనా రాజధాని అని చెబుతోన్న విశాఖలో ఇటువంటి పరిస్థితి ఉంటే ఎలా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on August 27, 2023 4:10 pm
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…