విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సౌత్ సైడ్ ఒక బస్సు షెల్టర్ కొత్తగా నిర్మించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి ఈ మోడరన్ బస్ షెల్టర్ ను ఐదు రోజుల క్రితమే అట్టహాసంగా ప్రారంభించారు. ఈ మోడరన్ బస్ షెల్టర్ కం బస్ బేకు 40 లక్షల రూపాయలు వెచ్చించారు. అయితే, పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఈ బస్సు షెల్టర్ కుంగిపోయి ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో, నాసిరకం నిర్మాణం చేపట్టిన ప్రభుత్వంపై జనసేనచ సిపిఎం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బస్ షెల్టర్ నిర్మాణ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సిపిఎం, జనసేన కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.
జీవీఎంసీ కార్యాలయం ముందు కట్టిన బస్ షెల్టర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, మిగతా వాటి పరిస్థితి ఏంటని వారు నిలదీస్తున్నారు. ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని, ఇలా నాలుగు రోజులకే బస్సు షెల్టర్ కూలిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆ కుంగిపోయిన బస్సు షెల్టర్ ముందు జనసేన, సిపిఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బస్ షెల్టర్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన వారిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పరిపాలనా రాజధాని అని చెబుతోన్న విశాఖలో ఇటువంటి పరిస్థితి ఉంటే ఎలా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on August 27, 2023 4:10 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…