Political News

అదే సీటు.. నేతలు, వారసుల పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించి అధికారం దక్కించుకునే దిశగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ కూడా వేగాన్ని పెంచుతోంది. టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 119 నియోజకవర్గాలకు గాను వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. అయితే ఇందులో ఒకే నియోజకవర్గం నుంచి నేతలతో పాటు వాళ్ల వారసులు కూడా బరిలో దిగేందుకు సిద్ధమవడం గమనార్హం. ఒకరికి కాకపోతే మరొకరికైనా టికెట్ వస్తుందనే ఆశతో ఇలా నేతలు, వారసులు దరఖాస్తు చేసుకున్నట్లు టాక్.

ముషీరాబాద్ టికెట్ కోసం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఆయన తనయుడు అనిల్ కుమార్ ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. ఆందోలు నియోజకవర్గంలో పోటీకి సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ రాజనరసింహతో పాటు ఆయన కుమార్తె త్రిష సిద్ధమయ్యారు. మరోవైపు సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకుల్లో పెద్దాయన రఘువీర్రెడ్డి మిర్యాలగూడ, చిన్నాయన జైవీర్రెడ్డి నాగార్జున సాగర్ కోసం దరఖాస్తులు సమర్పించారు.

ఎమ్మెల్యే సీతక్క తనయుడు సూర్యం పినపాక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ఒకటే కుటుంబం నుంచి ఇద్దరు దరఖాస్తు చేసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇద్దరిలో ఒకరికి టికెట్ నిరాకరించినా.. మరొకరికైనా అధిష్ఠానం టికెట్ ఇస్తుందనే ఆశతో వీళ్లున్నారు.

This post was last modified on August 26, 2023 5:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

56 minutes ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

7 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

7 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

9 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

9 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

10 hours ago