Political News

మోత్కుపల్లి అనే లీడర్ ఉన్నారా?

ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆయనది. గతంలో మంత్రిగానూ పని చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మొదలైన ఆయన ప్రస్థానం.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల గుండా సాగి ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతోంది. కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రశంసిస్తూ ఆ నేత బీఆర్ఎస్లో చేరారు. కానీ కొన్ని రోజులు హడావుడి చేసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో మరోసారి యాక్టివ్ అయ్యారు. ఆయనే.. మోత్కుపల్లి నర్సింహులు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఈ బీఆర్ఎస్ నేత ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ఆలేరు నుంచి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్సీ నేత మోత్కుపల్లి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీ గూటికి చేరారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. కానీ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓటమి తర్వాత పార్టీ వీడారు. 2018లో ఆలేరు నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ తరపున పోటీ చేసి ఓడారు. అనంతరం బీజేపీలోకి వెళ్లారు. 2021 అక్టోబర్లో బీఆర్ఎస్లో చేరారు. అప్పుడు మోత్కుపల్లిని ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం సాగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. అయినా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందేమోనని ఆయన ఇన్ని రోజులు సైలెంట్గానే ఉన్నారు.

ఆలేరు నుంచి పోటీ చేసేందుకు మోత్కుపల్లి ఆశలు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ మొండిచెయ్యి చూపించడంతో మోత్కుపల్లి ఇప్పుడు రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అనుచరులతో కలిసి యాదగిరి గుుట్టలో సమావేశం నిర్వహించబోతున్నారు. మరి ఈ సమావేశం తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మోత్కుపల్లి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

9 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

11 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

49 minutes ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

1 hour ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago