కామ్రెడ్లకు కాంగ్రెస్ కు జై కొట్టక వేరేదారిలేదు. కేసీయార్ చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నారు. పొత్తుల పెట్టుకుంటామని నమ్మించి చివరినిముషంలో కేసీయార్ తమను మోసం చేశారని సీపీఐ, సీపీఎం కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం మండిపోతున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు మీడియా సమావేశంలోనే చెప్పారు. విచిత్రం ఏమిటంటే తమలోని తప్పులను దాచుకుని తప్పంతా కేసీయార్ మీద తోసేస్తున్నారు. అసలు కేసీయార్ ను నమ్మటమే వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు.
అవసరానికి దగ్గరకు తీసుకుని అవసరం తీరిపోయిన తర్వాత దూరంగా తరిమేయటం కేసీయార్ కు మొదటినుండి అలవాటే. ఈ విషయం వామపక్షాలకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే దెబ్బతిన్నారు. వ్యక్తులైనా, పార్టీలైనా కేసీయార్ కు ఒకటే. ఎవరైనా తన అవసరానికి ఉపయోగపడాలని అనుకుంటారే కానీ తాను మాత్రం ఎవరికీ ఉపయోగపడటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇలాంటి కేసీయార్ మాటమీదుంటారని, తమతో పొత్తు పెట్టుకుని పదిసీట్లు ఇస్తారని కామ్రెడ్లు ఎలా నమ్మారో అర్ధంకావటంలేదు.
ఇపుడేమైంది తమను కేసీయార్ మోసంచేశారనే మంటతో కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంతో తమ ఓట్లను కాంగ్రెస్ కు వేయించేందుకు రెండుపార్టీలు మాట్లాడుకుంటున్నాయి. తాము పోటీచేసే సీట్లలో కాంగ్రెస్ పోటీ పెట్టకుండా ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లో తమ ఓట్లను కాంగ్రెస్ వేయించేట్లుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి దీనివల్ల కూడా వామపక్షాలు నష్టపోతాయి.
ఎలాగంటే కేసీయార్ ను నమ్మద్దని తమతో చేతులు కలపమని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడిగారు. అప్పట్లో రేవంత్ పిలుపును వామపక్షాలు ఖండించాయి. బీఆర్ఎస్ తో తప్ప తాము మరేపార్టీతోనే పొత్తు పెట్టుకునేది లేదని గట్టిగా చెప్పాయి. దాంతో ఏమైందంటే వామపక్షాలు పోటీచేస్తాయని అంచనా వేసిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పోటీకి రెడీ అయిపోయింది. ఇపుడు ఆ నేతలను పోటీలో నుండి తప్పుకోమంటే వాళ్ళు అంగీకరించరు. దాంతో కచ్చితంగా అన్నీ నియోజకవర్గాల్లోను అందరు పోటీలో ఉండక తప్పని పరిస్ధితులు ఏర్పడ్డాయి. మరీ సమస్య నుండి వామపక్షాలు ఎలా బయటపడతాయో చూడాల్సిందే.
This post was last modified on August 23, 2023 9:26 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…