కామ్రెడ్లకు కాంగ్రెస్ కు జై కొట్టక వేరేదారిలేదు. కేసీయార్ చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నారు. పొత్తుల పెట్టుకుంటామని నమ్మించి చివరినిముషంలో కేసీయార్ తమను మోసం చేశారని సీపీఐ, సీపీఎం కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం మండిపోతున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు మీడియా సమావేశంలోనే చెప్పారు. విచిత్రం ఏమిటంటే తమలోని తప్పులను దాచుకుని తప్పంతా కేసీయార్ మీద తోసేస్తున్నారు. అసలు కేసీయార్ ను నమ్మటమే వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు.
అవసరానికి దగ్గరకు తీసుకుని అవసరం తీరిపోయిన తర్వాత దూరంగా తరిమేయటం కేసీయార్ కు మొదటినుండి అలవాటే. ఈ విషయం వామపక్షాలకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే దెబ్బతిన్నారు. వ్యక్తులైనా, పార్టీలైనా కేసీయార్ కు ఒకటే. ఎవరైనా తన అవసరానికి ఉపయోగపడాలని అనుకుంటారే కానీ తాను మాత్రం ఎవరికీ ఉపయోగపడటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇలాంటి కేసీయార్ మాటమీదుంటారని, తమతో పొత్తు పెట్టుకుని పదిసీట్లు ఇస్తారని కామ్రెడ్లు ఎలా నమ్మారో అర్ధంకావటంలేదు.
ఇపుడేమైంది తమను కేసీయార్ మోసంచేశారనే మంటతో కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంతో తమ ఓట్లను కాంగ్రెస్ కు వేయించేందుకు రెండుపార్టీలు మాట్లాడుకుంటున్నాయి. తాము పోటీచేసే సీట్లలో కాంగ్రెస్ పోటీ పెట్టకుండా ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లో తమ ఓట్లను కాంగ్రెస్ వేయించేట్లుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి దీనివల్ల కూడా వామపక్షాలు నష్టపోతాయి.
ఎలాగంటే కేసీయార్ ను నమ్మద్దని తమతో చేతులు కలపమని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడిగారు. అప్పట్లో రేవంత్ పిలుపును వామపక్షాలు ఖండించాయి. బీఆర్ఎస్ తో తప్ప తాము మరేపార్టీతోనే పొత్తు పెట్టుకునేది లేదని గట్టిగా చెప్పాయి. దాంతో ఏమైందంటే వామపక్షాలు పోటీచేస్తాయని అంచనా వేసిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పోటీకి రెడీ అయిపోయింది. ఇపుడు ఆ నేతలను పోటీలో నుండి తప్పుకోమంటే వాళ్ళు అంగీకరించరు. దాంతో కచ్చితంగా అన్నీ నియోజకవర్గాల్లోను అందరు పోటీలో ఉండక తప్పని పరిస్ధితులు ఏర్పడ్డాయి. మరీ సమస్య నుండి వామపక్షాలు ఎలా బయటపడతాయో చూడాల్సిందే.
This post was last modified on August 23, 2023 9:26 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…