Political News

అక్కడి నుంచి జగన్ బావమరిది

వైఎస్సార్ జిల్లా కమలాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో జగన్ బావమరిది పోటీ చేయబోతున్నారా? ఈ మేరకు జగన్ హామీ ఇచ్చారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కమలాపురం ఎమ్మెల్యేగా జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. వరుసగా రెండో సారి ఎన్నికల్లో గెలిచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన తనయుడు నరేన్ రామాంజనేయరెడ్డిని బరిలో దింపాలని చూస్తున్నట్లు తెలిసింది.

జగన్కు వరుసకు బావమరిది అయ్యే రామాంజనేయరెడ్డి ఎన్నికల్లో పోటీ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన చింతకొమ్మదిన్నె జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు. కుమారుడిని పోటీలోకి దించి, తాను వ్యాపారాలు చూసుకోవాలని రవీంద్రనాథ్ రెడ్డి అనుకుంటున్నారని తెలిసింది. మరోసారి జగన్ పేరు చెప్పి మాత్రమే ఓట్లు దండుకోవాలని ఆయన ప్లాన్ వేసినట్లు టాక్. మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ను ఆశీర్వదించాలని తన నియోజకవర్గ ప్రజలను రవీంద్రనాథ్ కోరుతున్నారని సమాచారం. మరోవైపు రామాంజనేయరెడ్డిని నిలబెడితే పరిస్థితి ఎలా ఉంటుందనే అంచనా కోసం కొడుకును వెంటబెట్టుకుని రవీంద్రనాథ్ పర్యటిస్తున్నారు.

అత్యంత దగ్గరి బంధువైన రవీంద్రనాథ్ కోరికను జగన్ కాదనే ఆస్కారం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో రామాంజనేయరెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. కానీ రవీంద్రనాథ్కు జాతకాల పిచ్చి ఉందని టాక్. అందుకే ఎన్నికల నాటి సమయం, ముహూర్తం చూసుకుని ఎవరు నిలబడితే గెలుస్తామో అని నిర్ణయిస్తారని కూడా అంటున్నారు. మరి ఎన్నికల్లో తండ్రి నిలబడతారా? కొడుకు బరిలో దిగుతారా? అన్నది చూడాలి.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

2 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

3 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

6 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

7 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

8 hours ago