Political News

ఆ ఎమ్మెల్యే ఈ సారి ఎంపీగా?

ఆసిఫాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాన్ని వదులుకోనున్నారా? లోక్ సభకు పోటిచేసేలా ఆయన్ని కేసీఆర్ ఒప్పించారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో గెలుపుపై కన్నేసిన కేసీఆర్.. అందుకు తగ్గ కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టిన ఆయన కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆసిఫాబాద్ ఎమ్మెల్యేను మార్చేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం.

2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆత్రం సక్కు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్మ్షీ చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కోవ లక్మ్షీపై గెలిచిన తర్వాత కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఏడాది ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ బీఆర్ఎస్ నాయకులను ప్రగతిభవన్కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో ఆత్రం సక్కుకు బదులు ప్రస్తుతం కుమురం భీం జడ్పీ ఛైర్ పర్సన్గా ఉన్న కోవ లక్మ్షీని పోటీ చేయించాలని కేసీఆర్ చూస్తున్నారని తెలిసింది. ఇదే విషయాన్ని ఆత్రం సక్కుకు కేసీఆర్ చెప్పారని సమాచారం. అయితే మొదట సుముఖత వ్యక్తం చేయని సక్కు.. లోక్ సభ సీటు ఇచ్చి గెలిపించుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో సరేనన్నారని తెలిసింది.

This post was last modified on August 20, 2023 8:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago