Political News

ఆ ఎమ్మెల్యే ఈ సారి ఎంపీగా?

ఆసిఫాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాన్ని వదులుకోనున్నారా? లోక్ సభకు పోటిచేసేలా ఆయన్ని కేసీఆర్ ఒప్పించారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో గెలుపుపై కన్నేసిన కేసీఆర్.. అందుకు తగ్గ కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టిన ఆయన కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆసిఫాబాద్ ఎమ్మెల్యేను మార్చేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం.

2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆత్రం సక్కు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్మ్షీ చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కోవ లక్మ్షీపై గెలిచిన తర్వాత కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఏడాది ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ బీఆర్ఎస్ నాయకులను ప్రగతిభవన్కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో ఆత్రం సక్కుకు బదులు ప్రస్తుతం కుమురం భీం జడ్పీ ఛైర్ పర్సన్గా ఉన్న కోవ లక్మ్షీని పోటీ చేయించాలని కేసీఆర్ చూస్తున్నారని తెలిసింది. ఇదే విషయాన్ని ఆత్రం సక్కుకు కేసీఆర్ చెప్పారని సమాచారం. అయితే మొదట సుముఖత వ్యక్తం చేయని సక్కు.. లోక్ సభ సీటు ఇచ్చి గెలిపించుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో సరేనన్నారని తెలిసింది.

This post was last modified on August 20, 2023 8:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బుమ్రానే కొట్టాడంటే.. బీసీసీఐ పేరు రాసుకోవాల్సిందే!

భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ అతను ఆడుతున్న…

44 seconds ago

ఇరాన్‌పై యుద్ధం: మొద‌లు-మ‌లుపులు ఇవే!

ఫిబ్ర‌వ‌రి 28: ప్ర‌పంచం నిద్ర‌లేచి క‌ళ్లు న‌లుముకుంటున్న స‌మ‌యం.. ఇంతలో ఏ టీవీ పెట్టినా.. ఒక‌టే బ్రేకింగ్ న్యూస్‌. ఇరాన్‌పై…

4 hours ago

పాపం దీదీ… ఏం జ‌రుగుతుందో!?

బ‌ల‌వంతుడు బ‌ల‌వంతుడే అన్న‌ట్టు.. రాజ‌కీయం.. రాజ‌కీయ‌మే!. ఈ మాట ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రె స్ పార్టీ అధినేత్రి…

5 hours ago

గూఢచారి-2 ఎప్పుడు వస్తుంది?

తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…

10 hours ago

ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు వైసీపీ `విలాసం`?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌పై దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం వ్య‌యంతో విలాస‌వంతంగా నిర్మించిన ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న…

10 hours ago

విజ‌య‌న్ వ‌ర్సెస్ రేవంత్‌… ర‌చ్చ‌-ర‌చ్చ‌!

కేర‌ళం ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌ ప్ర‌చారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. సీనియ‌ర్…

11 hours ago