ఆసిఫాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాన్ని వదులుకోనున్నారా? లోక్ సభకు పోటిచేసేలా ఆయన్ని కేసీఆర్ ఒప్పించారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో గెలుపుపై కన్నేసిన కేసీఆర్.. అందుకు తగ్గ కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టిన ఆయన కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆసిఫాబాద్ ఎమ్మెల్యేను మార్చేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం.
2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆత్రం సక్కు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్మ్షీ చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కోవ లక్మ్షీపై గెలిచిన తర్వాత కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఏడాది ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ బీఆర్ఎస్ నాయకులను ప్రగతిభవన్కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో ఆత్రం సక్కుకు బదులు ప్రస్తుతం కుమురం భీం జడ్పీ ఛైర్ పర్సన్గా ఉన్న కోవ లక్మ్షీని పోటీ చేయించాలని కేసీఆర్ చూస్తున్నారని తెలిసింది. ఇదే విషయాన్ని ఆత్రం సక్కుకు కేసీఆర్ చెప్పారని సమాచారం. అయితే మొదట సుముఖత వ్యక్తం చేయని సక్కు.. లోక్ సభ సీటు ఇచ్చి గెలిపించుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో సరేనన్నారని తెలిసింది.
This post was last modified on August 20, 2023 8:13 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…