ప్రభుత్వ నిర్ణయాల పరంగా, పార్టీలోని విషయాల పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కఠినంగా ఉంటారనే విషయం తెలిసిందే. పార్టీలో తోక ఎగిరేసే నాయకులను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే సొంత నేతలనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు పంపిస్తారనే టాక్ ఉంది. మరోవైపు ఇతర పార్టీల్లో చేరిన మాజీ బీఆర్ఎస్ నాయకులనూ కేసీఆర్ దెబ్బకొడతారనే అభిప్రాయాలున్నాయి. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలోనే కేసీఆర్ అదే పని చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన ఖమ్మంలో భారీ సభ పెట్టి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి పొంగులేటి సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
కానీ తాజాగా పొంగులేటికి షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పొంగులేటి వెంటే కాంగ్రెస్లో చేరిన ఆయన అనుచరులను ఒక్కొక్కరిగా తిరిగి బీఆర్ఎస్లో చేరేలా కేసీఆర్ ప్రణాళికలు అమలు చేస్తున్నారని తెలిసింది. తాజాగా పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకట్రావు, ఆయన భార్య ప్రవీణ, దమ్ముగూడెం జడ్పీటీసీ సభ్యురాలు సీతమ్మతో సహా కొంతమంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల సమయం నాటికి పొంగులేటిని ఒంటరిగా మార్చాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
This post was last modified on August 19, 2023 6:20 am
దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…
మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…
స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…
గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…
ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…
గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…