Political News

పొంగులేటికి కేసీఆర్ దెబ్బ

ప్రభుత్వ నిర్ణయాల పరంగా, పార్టీలోని విషయాల పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కఠినంగా ఉంటారనే విషయం తెలిసిందే. పార్టీలో తోక ఎగిరేసే నాయకులను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే సొంత నేతలనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు పంపిస్తారనే టాక్ ఉంది. మరోవైపు ఇతర పార్టీల్లో చేరిన మాజీ బీఆర్ఎస్ నాయకులనూ కేసీఆర్ దెబ్బకొడతారనే అభిప్రాయాలున్నాయి. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలోనే కేసీఆర్ అదే పని చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన ఖమ్మంలో భారీ సభ పెట్టి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి పొంగులేటి సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

కానీ తాజాగా పొంగులేటికి షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పొంగులేటి వెంటే కాంగ్రెస్లో చేరిన ఆయన అనుచరులను ఒక్కొక్కరిగా తిరిగి బీఆర్ఎస్లో చేరేలా కేసీఆర్ ప్రణాళికలు అమలు చేస్తున్నారని తెలిసింది. తాజాగా పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకట్రావు, ఆయన భార్య ప్రవీణ, దమ్ముగూడెం జడ్పీటీసీ సభ్యురాలు సీతమ్మతో సహా కొంతమంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల సమయం నాటికి పొంగులేటిని ఒంటరిగా మార్చాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

This post was last modified on August 19, 2023 6:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీతా విలియమ్స్ 9 నెలల అంతరిక్ష ప్రయాణం… సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

5 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

40 minutes ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

1 hour ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

2 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago