సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికే చేరబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగ్గారెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకునే దిశగా చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఆయన బీఆర్ఎస్ తరపున పోటీ చేయడం దాదాపుగా ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డిపై బీఆర్ఎస్ నేత చింతా ప్రభాకర్ రెడ్డి విజయం సాధించి తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ 2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు చింతా ప్రభాకర్రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరతారనే వార్త చింతాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెబుతున్నారు. జగ్గారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. చింతాను ఎమ్మెల్సీని చేస్తానని కేసీఆర్ చెప్పారని సమాచారం.
కానీ ఎమ్మెల్సీ పదవి పై చింతా ఆసక్తితో లేరని తెలిసింది. మరోసారి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నారని టాక్. దీంతో చింతా వర్గం నాయకులు, అనుచరులు.. జగ్గారెడ్డిని బీఆర్ఎస్లోకి చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించిన సంగారెడ్డి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. తాజాగా 200 మంది నాయకులు కలిసి హరీష్ రావు నివాసానికి వెళ్లి జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని కోరారని తెలిసింది. మరి చింతాకు చింత తప్పుతుందా? లేదా జగ్గారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నిలబడతారా? అన్నది కేసీఆర్ చేతుల్లో ఉంది.
This post was last modified on August 18, 2023 9:41 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…