సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికే చేరబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగ్గారెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకునే దిశగా చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఆయన బీఆర్ఎస్ తరపున పోటీ చేయడం దాదాపుగా ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డిపై బీఆర్ఎస్ నేత చింతా ప్రభాకర్ రెడ్డి విజయం సాధించి తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ 2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు చింతా ప్రభాకర్రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరతారనే వార్త చింతాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెబుతున్నారు. జగ్గారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. చింతాను ఎమ్మెల్సీని చేస్తానని కేసీఆర్ చెప్పారని సమాచారం.
కానీ ఎమ్మెల్సీ పదవి పై చింతా ఆసక్తితో లేరని తెలిసింది. మరోసారి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నారని టాక్. దీంతో చింతా వర్గం నాయకులు, అనుచరులు.. జగ్గారెడ్డిని బీఆర్ఎస్లోకి చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించిన సంగారెడ్డి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. తాజాగా 200 మంది నాయకులు కలిసి హరీష్ రావు నివాసానికి వెళ్లి జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని కోరారని తెలిసింది. మరి చింతాకు చింత తప్పుతుందా? లేదా జగ్గారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నిలబడతారా? అన్నది కేసీఆర్ చేతుల్లో ఉంది.
This post was last modified on August 18, 2023 9:41 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…