సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికే చేరబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగ్గారెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకునే దిశగా చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఆయన బీఆర్ఎస్ తరపున పోటీ చేయడం దాదాపుగా ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డిపై బీఆర్ఎస్ నేత చింతా ప్రభాకర్ రెడ్డి విజయం సాధించి తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ 2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు చింతా ప్రభాకర్రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరతారనే వార్త చింతాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెబుతున్నారు. జగ్గారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. చింతాను ఎమ్మెల్సీని చేస్తానని కేసీఆర్ చెప్పారని సమాచారం.
కానీ ఎమ్మెల్సీ పదవి పై చింతా ఆసక్తితో లేరని తెలిసింది. మరోసారి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నారని టాక్. దీంతో చింతా వర్గం నాయకులు, అనుచరులు.. జగ్గారెడ్డిని బీఆర్ఎస్లోకి చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించిన సంగారెడ్డి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. తాజాగా 200 మంది నాయకులు కలిసి హరీష్ రావు నివాసానికి వెళ్లి జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని కోరారని తెలిసింది. మరి చింతాకు చింత తప్పుతుందా? లేదా జగ్గారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నిలబడతారా? అన్నది కేసీఆర్ చేతుల్లో ఉంది.
This post was last modified on August 18, 2023 9:41 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…