టాలీవుడ్ హీరోయిన్ రేణూదేశాయ్ కొద్ది రోజుల క్రితం పవన్ డబ్బు మనిషి కాదు అని..ప్రజలకు మంచి చేయడానికే వచ్చాడు తప్ప..డబ్బులు కోసం కాదు అని చెబుతూ ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన తరువాత పవన్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉంటే కొంత మంది మాత్రం ఆమె పై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి నిన్ను ఇందుకు కాదు పవన్ తన్ని తరిమేసింది అంటూ కామెంట్ చేశాడు. దాని గురించి స్పందించిన రేణు ఆ నెటిజన్ కామెంట్ కి గట్టిగా సమాధానం చెప్పింది. ” నా విడాకుల విషయంలో నా మాజీ భర్త ఎలా మోసం చేశాడో చెప్పినప్పుడు ఆయన అభిమానులు నన్ను తిట్టారు.
ఇప్పుడు దేశ పౌరురాలిగా నేను అతనికి అనుకూలంగా కొన్ని మాటలు మాట్లాడితే దారుణంగా నాపై కామెంట్లు చేస్తున్నారు. విడాకుల విషయంలో నా మాజీ భర్త గురించి అప్పట్లో నేను మాట్లాడింది నిజం. ఆరోజు నేను అలా మాట్లాడినందుకు నేను కొందరి నుంచి డబ్బులు తీసుకున్నానని పవన్ అభిమానులు ఆరోపణలు చేశారు.
అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా నన్ను దారుణంగా దూషించారు కూడా. ఇప్పుడు కూడా నా విషయంలో అదే జరుగుతోంది. నా మాజీ భర్తకు అనుకూలంగా ఉండే కొందరు వ్యక్తులు నాకు డబ్బులు ఇచ్చారని అభిమానులు ఆరోపిస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. నా మాజీ భర్త గురించి నేను అప్పుడు, ఇప్పుడూ నిజమే చెప్పాను.
అతనితో ప్రేమలో పడి నిజాలు మాట్లాడినందుకు తగిన మూల్యాన్ని ఎప్పటి నుంచో చెల్లించుకుంటున్నాను. నాకు ఇలా కావాల్సిందే..నా విధి ఇదే. అది ఎలా ఉంటే అలాగే కానియండి..దయచేసి నాపై దుర్భాషలాడకండి` అంటూ రేణూ దేశాయ్ సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
పవన్ పై ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రేణూ దేశాయ్ ఓ నెటిజన్ తనని దారుణంగా అవమానిస్తూ కామెంట్ చేసిన పోస్ట్ ని షేర్ చేసింది. అందుకే నిన్ను పవన్ తన్ని తరిమేశాడు అని కామెంట్ చేశాడు. దీనికి రేణూ దేశాయ్ సరైన సమాధానం చెప్పారు. నన్ను తిట్టడంలో నీకు మనశ్శాంతి లభించిందా?..కానివ్వండి అంటూ రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పవన్ కల్యాణ్ తో విడిపోయిన తరువాత రేణూ దేశాయ్ పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నారు. సినిమాలు, టీవీ షోలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె ఇటీవలే మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె కథకు కీలకమైన హేమలతా లవనం పాత్రలో నటిస్తున్నారు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…