Political News

అభిమానులు..వ్యతిరేకులు..ఇలాగే తిట్టండి: రేణు దేశాయ్‌

టాలీవుడ్‌ హీరోయిన్‌ రేణూదేశాయ్‌ కొద్ది రోజుల క్రితం పవన్‌ డబ్బు మనిషి కాదు అని..ప్రజలకు మంచి చేయడానికే వచ్చాడు తప్ప..డబ్బులు కోసం కాదు అని చెబుతూ ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్ చూసిన తరువాత పవన్‌ అభిమానులు ఎంతో సంతోషంగా ఉంటే కొంత మంది మాత్రం ఆమె పై ట్రోలింగ్‌ చేయడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి నిన్ను ఇందుకు కాదు పవన్‌ తన్ని తరిమేసింది అంటూ కామెంట్ చేశాడు. దాని గురించి స్పందించిన రేణు ఆ నెటిజన్‌ కామెంట్‌ కి గట్టిగా సమాధానం చెప్పింది. ” నా విడాకుల విషయంలో నా మాజీ భర్త ఎలా మోసం చేశాడో చెప్పినప్పుడు ఆయన అభిమానులు నన్ను తిట్టారు.

ఇప్పుడు దేశ పౌరురాలిగా నేను అత‌నికి అనుకూలంగా కొన్ని మాట‌లు మాట్లాడితే దారుణంగా నాపై కామెంట్‌లు చేస్తున్నారు. విడాకుల విష‌యంలో నా మాజీ భ‌ర్త గురించి అప్ప‌ట్లో నేను మాట్లాడింది నిజం. ఆరోజు నేను అలా మాట్లాడినందుకు నేను కొంద‌రి నుంచి డ‌బ్బులు తీసుకున్నాన‌ని ప‌వ‌న్ అభిమానులు ఆరోప‌ణ‌లు చేశారు.

అంతే కాకుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా న‌న్ను దారుణంగా దూషించారు కూడా. ఇప్పుడు కూడా నా విష‌యంలో అదే జ‌రుగుతోంది. నా మాజీ భ‌ర్త‌కు అనుకూలంగా ఉండే కొంద‌రు వ్య‌క్తులు నాకు డ‌బ్బులు ఇచ్చార‌ని అభిమానులు ఆరోపిస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. నా మాజీ భ‌ర్త గురించి నేను అప్పుడు, ఇప్పుడూ నిజ‌మే చెప్పాను.

అతనితో ప్రేమలో పడి నిజాలు మాట్లాడినందుకు తగిన మూల్యాన్ని ఎప్పటి నుంచో చెల్లించుకుంటున్నాను. నాకు ఇలా కావాల్సిందే..నా విధి ఇదే. అది ఎలా ఉంటే అలాగే కానియండి..ద‌య‌చేసి నాపై దుర్భాష‌లాడ‌కండి` అంటూ రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

ప‌వ‌న్ పై ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన రేణూ దేశాయ్ ఓ నెటిజ‌న్ త‌న‌ని దారుణంగా అవ‌మానిస్తూ కామెంట్ చేసిన‌ పోస్ట్ ని షేర్ చేసింది. అందుకే నిన్ను ప‌వ‌న్ త‌న్ని త‌రిమేశాడు అని కామెంట్ చేశాడు. దీనికి రేణూ దేశాయ్ స‌రైన స‌మాధానం చెప్పారు. న‌న్ను తిట్ట‌డంలో నీకు మ‌న‌శ్శాంతి ల‌భించిందా?..కానివ్వండి అంటూ రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో విడిపోయిన తరువాత రేణూ దేశాయ్ పిల్ల‌ల‌తో క‌లిసి వేరుగా ఉంటున్నారు. సినిమాలు, టీవీ షోల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న ఆమె ఇటీవ‌లే మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న స్టూవ‌ర్ట్ పురం గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్ ఆధారంగా రూపొందుతున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో ఆమె క‌థ‌కు కీల‌క‌మైన హేమ‌ల‌తా ల‌వ‌నం పాత్ర‌లో న‌టిస్తున్నారు.

This post was last modified on August 17, 2023 10:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago