Political News

జగన్ కు పవన్ 48 గంటల అల్టిమేటం

సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్..తాజాగా నేడు భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. ఎర్ర మట్టి దిబ్బలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పవన్ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలోనే జగన్ పై పవన్ మండిపడ్డారు. ఎర్రమట్టి దిబ్బలు విశాఖ వారసత్వ సంపద. అని, వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఈ వ్యవహారంపై జగన్ ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకుంటే ఎన్జీటీకి వెళ్తామని పవన్ అల్టిమేటం జారీ చేశారు.

ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద అని, శ్రీలంకతోపాటు మన విశాఖలో ఉన్నాయని పవన్ చెప్పారు. 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు 292 ఎకరాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ సంపదను కాపాడుకోవడం మన బాధ్యత అని, ఎర్రమట్టి దిబ్బలున్న ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. వేల సంవత్సరాలుగా ఎర్రమట్టిదిబ్బలు సహజసిద్ధంగా ఏర్పాడ్డాయని, వైసీపీ నేతలకు చిన్నపాటి కనికరం కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఎర్రమట్టిదిబ్బల్లో నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్రాలో వైసీపీ నేతల దోపిడీని ఆపాలని, ఎర్రమట్టి దిబ్బలపై పర్యావరణ ప్రేమికులు దృష్టిపెట్టాలని పవన్ కోరారు. ఎర్రమట్టి దిబ్బల సమీపంలో మట్టి తవ్వాల్సిన అవసరం వీఎంఆర్డీఏకు ఏంటని నిలదీశారు. కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని కోరారు. 1200 ఎకరాలను నేవీకి ఇస్తే 292 ఎకరాలు మిగిలిందని, వైసీపీ హయాంలో అవి కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని మండిపడ్డారు.

వాలంటీర్లే వైసీపీకి ప్రైవేటు సైన్యం అని, సాక్షి పేపర్ కోసం ప్రతి ఏడాది 48 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అర్హత లేని వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమదే అనే భ్రమలో జగ్గు భాయ్ అండ్ గ్యాంగ్ ఉన్నారని పవన్ దుయ్యబట్టారు.

This post was last modified on August 16, 2023 9:58 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

2 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

8 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

10 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

10 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

11 hours ago