కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు చిరుత, ఎలుగుబంటి వంటి వన్యప్రాణుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిన్నారులపై చిరుత దాడి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ క్రమంలోనే భద్రతా చర్యల పేరుతో టీటీడీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికి ఒక ఊతకర్ర ఇస్తామంటూ టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.
సైలెంట్ గా కర్రను ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమోగానీ మానవజాతి పరిణామ క్రమంలో కర్రకు ఎంతో ప్రాధాన్యత ఉందంటూ కేజీఎఫ్ రేంజ్ లో బిల్డప్ ఇవ్వడంతో కరుణాకర్ రెడ్డిపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై టిడిపి నేత బోండా ఉమ స్పందించారు. వైసీపీలో ‘పుష్ప’లు ఎక్కువయ్యారని, అడవుల్లో ఎర్ర చందనం కోసం చెట్లు నరికేయడం వల్లే నడకమార్గంలోకి పులులు వస్తున్నాయని సంచలన ఆరోపణ చేశారు.
అధికార పార్టీ అండతో యదేచ్చగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. చిరుతను తరిమేందుకు బ్రహ్మాండమైన ఊతకర్ర ఇస్తామని చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఆ కర్రలతో ప్రభుత్వానికి భక్తులు బడిత పూజ చేయాలని బోండా ఉమా పిలుపునిచ్చారు.చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ పై ప్రజెంటేషన్ ఇస్తే వైసిపి ప్రిజన్ డాక్యుమెంట్ పై ప్రజెంటేషన్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అవినీతి ఆరోపణలు చేయడం తప్ప ఒకటైన నిరూపించారా అని నిలదీశారు.
ఎన్ని ఎంక్వయిరీలు వేసినా చంద్రబాబు కాలి గోటిని కూడా టచ్ చేయలేకపోయారని అన్నారు. చంద్రబాబు తప్పు చేస్తే నాలుగున్నరేళ్లు జగన్ ఊరుకునేవాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు 420 అయితే వైసిపి వాళ్ళు 840 అని నిప్పులు చెరిగారు. జగన్ పని అయిపోయిందని అందుకే అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారం చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఒంటిమీద మంచి బట్టలు ఉన్నా పథకాల్లో కోత వేశారని, 10 మందికి ఇచ్చి 90 మందికి ఎగ్గొట్టారని విమర్శించారు. తాగుబోతుల జేబులు కొట్టేసి 10 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
This post was last modified on August 16, 2023 7:08 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…