Political News

వైసీపీ ‘పుష్ప’ల వల్లే అలిపిరిలో చిరుతలు: బోండా ఉమ

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు చిరుత, ఎలుగుబంటి వంటి వన్యప్రాణుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిన్నారులపై చిరుత దాడి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ క్రమంలోనే భద్రతా చర్యల పేరుతో టీటీడీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికి ఒక ఊతకర్ర ఇస్తామంటూ టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.

సైలెంట్ గా కర్రను ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమోగానీ మానవజాతి పరిణామ క్రమంలో కర్రకు ఎంతో ప్రాధాన్యత ఉందంటూ కేజీఎఫ్ రేంజ్ లో బిల్డప్ ఇవ్వడంతో కరుణాకర్ రెడ్డిపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై టిడిపి నేత బోండా ఉమ స్పందించారు. వైసీపీలో ‘పుష్ప’లు ఎక్కువయ్యారని, అడవుల్లో ఎర్ర చందనం కోసం చెట్లు నరికేయడం వల్లే నడకమార్గంలోకి పులులు వస్తున్నాయని సంచలన ఆరోపణ చేశారు.

అధికార పార్టీ అండతో యదేచ్చగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. చిరుతను తరిమేందుకు బ్రహ్మాండమైన ఊతకర్ర ఇస్తామని చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఆ కర్రలతో ప్రభుత్వానికి భక్తులు బడిత పూజ చేయాలని బోండా ఉమా పిలుపునిచ్చారు.చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ పై ప్రజెంటేషన్ ఇస్తే వైసిపి ప్రిజన్ డాక్యుమెంట్ పై ప్రజెంటేషన్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అవినీతి ఆరోపణలు చేయడం తప్ప ఒకటైన నిరూపించారా అని నిలదీశారు.

ఎన్ని ఎంక్వయిరీలు వేసినా చంద్రబాబు కాలి గోటిని కూడా టచ్ చేయలేకపోయారని అన్నారు. చంద్రబాబు తప్పు చేస్తే నాలుగున్నరేళ్లు జగన్ ఊరుకునేవాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు 420 అయితే వైసిపి వాళ్ళు 840 అని నిప్పులు చెరిగారు. జగన్ పని అయిపోయిందని అందుకే అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారం చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఒంటిమీద మంచి బట్టలు ఉన్నా పథకాల్లో కోత వేశారని, 10 మందికి ఇచ్చి 90 మందికి ఎగ్గొట్టారని విమర్శించారు. తాగుబోతుల జేబులు కొట్టేసి 10 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

This post was last modified on August 16, 2023 7:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

3 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

4 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

5 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

5 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

6 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

8 hours ago