Political News

వైసీపీ కన్నా మంచి పథకాలు తెస్తా: పవన్

2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించకపోతే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు రావని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే, టిడిపి, జనసేనలకు ఓటు వేయకూడదని, వైసిపినే మరోసారి గెలిపించి జగన్ ను సీఎం చేయాలని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఇక, వాలంటీర్లు కూడా పరోక్షంగా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లిస్ట్ అవుట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీని గెలిపించుకుంటే పథకాలు రావన్న భయం అక్కరలేదని, జనసేన అధికారంలోకి వస్తే ఇంకా మంచి పథకాలు తీసుకువస్తుందని పవన్ స్పష్టతనిచ్చారు.

జనసేన వీర మహిళలతో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమావేశమైన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనకి అండగా నిలబడాలని, యువత భవిష్యత్తుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు జనసేన భరోసానిస్తుందని చెప్పారు. సీఎం స్థాయిలో ఉన్న జగన్ ఒక ప్రాంతానికి కులాన్ని అంటగట్టి మాట్లాడుతున్నారని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పవన్ నిప్పులు చెరిగారు. 38 కేసులన్న జగన్ కోర్టు తీర్పులను తప్పు పడుతున్నారని, రుషికొండ వంటి వాటిని ధ్వంసం చేస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో 30 వేల మంది మహిళల అదృశ్యం పెద్ద విషయమని, రేప్ చేస్తామని మహిళలను బెదిరించే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ రకంగా ఉన్నాయో అర్థం అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో జనసేన తరఫున త్వరలోనే ప్రజా కోర్టు కార్యక్రమం చేపట్టబోతున్నామని, తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. సోషల్ మీడియాలో ఈ కార్యక్రమం ఉంటుందని, సందర్భానుసారంగా కొన్నిసార్లు బయట ఈ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. తప్పు చేసిన వారికి ప్రజా కోర్టులో ఏ ఏ చట్టాల కింద శిక్ష పడాలి, రాజ్యాంగ ఉల్లంఘన ఎలా జరుగుతుంది అన్నదానిపై ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. తాడేపల్లి ప్రాంతంలో క్రైమ్ రేట్ అత్యధికంగా ఉందని, అటువంటి వాటిపై మహిళా కమిషన్ స్పందించదని మండిపడ్డారు.

This post was last modified on August 16, 2023 9:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వంట సామాగ్రితో రెడీగా ఉండండి… దీదీ హాట్ కామెంట్స్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…

2 hours ago

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

5 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

6 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

7 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

7 hours ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

8 hours ago