Political News

ఎక్కడ ఓడారో.. అక్కడే..

ఎక్కడ ఓడారో అక్కడే తమ సత్తా చాటాలనుకుంటున్నారు ఆ ఇద్దరు నేతలు. తాము ఓడిన నియోజకవర్గంలోనే పర్యటించి ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఇద్దరు ఒకరు పవన్‌ కల్యాణ్‌ కాగా.. మరొకరు నారా లోకేశ్‌. మొన్న గాజువాకలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన, నేడు మంగళగిరిలో నారా లోకేష్‌ పాదయాత్ర యాథ`చ్ఛికమే. అయినా ఈ యాత్రల మధ్య ఒక కామన్‌ విశేషం ఉంది.

2019 ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేశారు. దాదాపు 16 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన తాను ఓటమి పాలైన నియోజకవర్గంలో మూడు రోజుల కిందట పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఓడినా గాజువాక తన నియోజకవర్గం అని సగర్వంగా ప్రటించారు. అక్కడి ప్రజలు కూడా ఆయనకు నీరాజనాలు పలకడం విశేషం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జనసేన జెండా ఎగురుతుందని ఆయన ప్రకటించారు.

మరోవైపున టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం మంగళగిరిలోకి అడుగు పెట్టింది. అక్కడ ఆయనకు అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం ఎదురైంది. పైగా వందల సంఖ్యలో వైసీపీ, ఇతర పార్టీల కార్యకర్తలు టీడీపీలో చేరడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో లోకేశ్‌ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా నిరుత్సాహ పడకుండా స్థానికంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పలు సామాజిక కార్యకమ్రాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు.

ఎక్కడ పోగుట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలనేది తెలుగు సామెత. ఈ ఇద్దరూ పార్టీలు వేరైనా తాము ఓడిన నియోజకవర్గాల్లో ఈ వారంలో పర్యటన చేపట్టారు. ఆ పర్యటనల్లో భారీగా వారి వారి కార్యకర్తలు హాజరై విజయవంతం చేయడం విశేషం. గాజువాక జన సైనికులతో హోరెత్తగా.. మంగళగిరి నారా లోకేష్‌ అభిమానులతో నిండిపోయింది. ఆ అభిమానం ఓట్ల రూపంలోకి మారతాయో లేదో చూడాలి మరి..?

This post was last modified on August 15, 2023 7:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

5 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

8 hours ago