జనసేన పార్టీలో 33 శాతం పదవులను మహిళలకే ఇవ్వనున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నా రు. మహిళలకు సమున్నత స్థానం ఇచ్చిన దేశం, పార్టీలు అభివృద్ధి చెందుతున్నాయని వ్యాఖ్యానించా రు. జనసేన మహిళా విభాగం వీర మహిళలతో తాజాగా ఆయన విశాఖ పట్నంలో భేటీ అయ్యారు. దేశ స్వాతం త్య్రోద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. వీర మహిళలు, ఆడపడుచుల ఆశీస్సులు లేకుండా పార్టీని నడపలేమన్నారు.
పేద, మధ్య తరగతి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని.. సమాజంలో తమ మేధస్సుతో రాణించా లని కోరుకుంటానని పవన్ తెలిపారు. జనసేనలో వీర మహిళలుగా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నామ ని చెప్పారు. జనసేన కార్యక్రమాల్లో మూడో వంతు మహిళలు ఉంటారని చెప్పారు. మహిళలకు అండగా ఉండేలా.. అనేక కార్యక్రమాలను గతంలోనే ప్రకటించినట్టు పవన్ తెలిపారు. వచ్చే మేనిఫెస్టోలోనూ.. ఇదే తరహాలో ముందుకు సాగుతామన్నారు.
సీఎంకు సిగ్గుందా?
రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలు అదృశ్యం అవుతున్నారని కేంద్ర ప్రభుత్వం కూడా గగ్గోలు పెడుతోందని.. అయినా.. ఈ ముఖ్యమంత్రికి ఈ విషయంపై దృష్టి పెట్టేందుకు తీరిక లేకుండా పోయిందని పవన్ వ్యాఖ్యానించారు. “వేల మంది మహిళలు అదృశ్యమవుతుంటే.. వారిని గుర్తించాలనే ఇంగితం సిగ్గు కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు“ అని పవన్ అన్నారు. భవిష్యత్తులో జనసేన అధికారంలోకి రాగానే మహిళలకు సరైన స్థానం ఇస్తామన్నారు.
ఏపీలో మహిళలపై దాడులు, దారుణాలు రోజూ జరుగుతున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దలు, మహిళా కమీషన్ మాట్లాడదని.. దిశ చట్టాలు, స్పందన అంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ, ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా? అని సీఎంను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.
This post was last modified on August 15, 2023 3:58 pm
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…