జనసేన పార్టీలో 33 శాతం పదవులను మహిళలకే ఇవ్వనున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నా రు. మహిళలకు సమున్నత స్థానం ఇచ్చిన దేశం, పార్టీలు అభివృద్ధి చెందుతున్నాయని వ్యాఖ్యానించా రు. జనసేన మహిళా విభాగం వీర మహిళలతో తాజాగా ఆయన విశాఖ పట్నంలో భేటీ అయ్యారు. దేశ స్వాతం త్య్రోద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. వీర మహిళలు, ఆడపడుచుల ఆశీస్సులు లేకుండా పార్టీని నడపలేమన్నారు.
పేద, మధ్య తరగతి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని.. సమాజంలో తమ మేధస్సుతో రాణించా లని కోరుకుంటానని పవన్ తెలిపారు. జనసేనలో వీర మహిళలుగా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నామ ని చెప్పారు. జనసేన కార్యక్రమాల్లో మూడో వంతు మహిళలు ఉంటారని చెప్పారు. మహిళలకు అండగా ఉండేలా.. అనేక కార్యక్రమాలను గతంలోనే ప్రకటించినట్టు పవన్ తెలిపారు. వచ్చే మేనిఫెస్టోలోనూ.. ఇదే తరహాలో ముందుకు సాగుతామన్నారు.
సీఎంకు సిగ్గుందా?
రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలు అదృశ్యం అవుతున్నారని కేంద్ర ప్రభుత్వం కూడా గగ్గోలు పెడుతోందని.. అయినా.. ఈ ముఖ్యమంత్రికి ఈ విషయంపై దృష్టి పెట్టేందుకు తీరిక లేకుండా పోయిందని పవన్ వ్యాఖ్యానించారు. “వేల మంది మహిళలు అదృశ్యమవుతుంటే.. వారిని గుర్తించాలనే ఇంగితం సిగ్గు కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు“ అని పవన్ అన్నారు. భవిష్యత్తులో జనసేన అధికారంలోకి రాగానే మహిళలకు సరైన స్థానం ఇస్తామన్నారు.
ఏపీలో మహిళలపై దాడులు, దారుణాలు రోజూ జరుగుతున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దలు, మహిళా కమీషన్ మాట్లాడదని.. దిశ చట్టాలు, స్పందన అంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ, ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా? అని సీఎంను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.
This post was last modified on August 15, 2023 3:58 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…