Political News

పార్టీలో 33 శాతం ప‌ద‌వులు మ‌హిళ‌ల‌కే:  ప‌వ‌న్

జ‌న‌సేన పార్టీలో 33 శాతం ప‌ద‌వుల‌ను మ‌హిళ‌ల‌కే ఇవ్వ‌నున్న‌ట్టు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నా రు. మ‌హిళ‌ల‌కు స‌మున్న‌త స్థానం ఇచ్చిన దేశం, పార్టీలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని వ్యాఖ్యానించా రు. జనసేన మ‌హిళా విభాగం వీర మహిళలతో తాజాగా ఆయ‌న విశాఖ ప‌ట్నంలో భేటీ అయ్యారు. దేశ స్వాతం త్య్రోద్య‌మంలో మ‌హిళ‌ల పాత్ర ఎంతో ఉంద‌న్నారు. వీర మహిళలు, ఆడపడుచుల ఆశీస్సులు లేకుండా పార్టీని నడపలేమన్నారు.

పేద, మధ్య తరగతి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని.. సమాజంలో తమ‌ మేధస్సుతో రాణించా లని కోరుకుంటానని ప‌వ‌న్‌ తెలిపారు. జనసేనలో వీర మహిళలుగా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నామ ని చెప్పారు. జనసేన కార్యక్రమాల్లో మూడో వంతు మహిళలు ఉంటారని చెప్పారు. మ‌హిళల‌కు అండ‌గా ఉండేలా.. అనేక కార్య‌క్ర‌మాల‌ను గ‌తంలోనే ప్ర‌క‌టించిన‌ట్టు ప‌వ‌న్ తెలిపారు. వ‌చ్చే మేనిఫెస్టోలోనూ.. ఇదే త‌ర‌హాలో ముందుకు సాగుతామ‌న్నారు.

సీఎంకు సిగ్గుందా?

రాష్ట్రంలో మ‌హిళ‌లు, మైన‌ర్ బాలిక‌లు అదృశ్యం అవుతున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం కూడా గ‌గ్గోలు పెడుతోంద‌ని.. అయినా.. ఈ ముఖ్య‌మంత్రికి ఈ విష‌యంపై దృష్టి పెట్టేందుకు తీరిక లేకుండా పోయింద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. “వేల మంది మ‌హిళ‌లు అదృశ్య‌మ‌వుతుంటే..  వారిని గుర్తించాల‌నే ఇంగితం సిగ్గు కూడా ఈ ముఖ్య‌మంత్రికి లేదు“ అని ప‌వ‌న్ అన్నారు.  భవిష్యత్తులో జ‌న‌సేన అధికారంలోకి రాగానే మ‌హిళ‌లకు సరైన స్థానం ఇస్తామ‌న్నారు.

ఏపీలో మహిళలపై దాడులు, దారుణాలు రోజూ  జరుగుతున్నాయని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ పెద్దలు, మహిళా కమీషన్ మాట్లాడదని.. దిశ చట్టాలు, స్పందన అంటూ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని.. కానీ, ఏ ఒక్క‌రికైనా న్యాయం జ‌రిగిందా? అని  సీఎంను ఉద్దేశించి ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. 

This post was last modified on August 15, 2023 3:58 pm

Share

Recent Posts

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

39 minutes ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

41 minutes ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

3 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

3 hours ago