Political News

పార్టీలో 33 శాతం ప‌ద‌వులు మ‌హిళ‌ల‌కే:  ప‌వ‌న్

జ‌న‌సేన పార్టీలో 33 శాతం ప‌ద‌వుల‌ను మ‌హిళ‌ల‌కే ఇవ్వ‌నున్న‌ట్టు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నా రు. మ‌హిళ‌ల‌కు స‌మున్న‌త స్థానం ఇచ్చిన దేశం, పార్టీలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని వ్యాఖ్యానించా రు. జనసేన మ‌హిళా విభాగం వీర మహిళలతో తాజాగా ఆయ‌న విశాఖ ప‌ట్నంలో భేటీ అయ్యారు. దేశ స్వాతం త్య్రోద్య‌మంలో మ‌హిళ‌ల పాత్ర ఎంతో ఉంద‌న్నారు. వీర మహిళలు, ఆడపడుచుల ఆశీస్సులు లేకుండా పార్టీని నడపలేమన్నారు.

పేద, మధ్య తరగతి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని.. సమాజంలో తమ‌ మేధస్సుతో రాణించా లని కోరుకుంటానని ప‌వ‌న్‌ తెలిపారు. జనసేనలో వీర మహిళలుగా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నామ ని చెప్పారు. జనసేన కార్యక్రమాల్లో మూడో వంతు మహిళలు ఉంటారని చెప్పారు. మ‌హిళల‌కు అండ‌గా ఉండేలా.. అనేక కార్య‌క్ర‌మాల‌ను గ‌తంలోనే ప్ర‌క‌టించిన‌ట్టు ప‌వ‌న్ తెలిపారు. వ‌చ్చే మేనిఫెస్టోలోనూ.. ఇదే త‌ర‌హాలో ముందుకు సాగుతామ‌న్నారు.

సీఎంకు సిగ్గుందా?

రాష్ట్రంలో మ‌హిళ‌లు, మైన‌ర్ బాలిక‌లు అదృశ్యం అవుతున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం కూడా గ‌గ్గోలు పెడుతోంద‌ని.. అయినా.. ఈ ముఖ్య‌మంత్రికి ఈ విష‌యంపై దృష్టి పెట్టేందుకు తీరిక లేకుండా పోయింద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. “వేల మంది మ‌హిళ‌లు అదృశ్య‌మ‌వుతుంటే..  వారిని గుర్తించాల‌నే ఇంగితం సిగ్గు కూడా ఈ ముఖ్య‌మంత్రికి లేదు“ అని ప‌వ‌న్ అన్నారు.  భవిష్యత్తులో జ‌న‌సేన అధికారంలోకి రాగానే మ‌హిళ‌లకు సరైన స్థానం ఇస్తామ‌న్నారు.

ఏపీలో మహిళలపై దాడులు, దారుణాలు రోజూ  జరుగుతున్నాయని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ పెద్దలు, మహిళా కమీషన్ మాట్లాడదని.. దిశ చట్టాలు, స్పందన అంటూ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని.. కానీ, ఏ ఒక్క‌రికైనా న్యాయం జ‌రిగిందా? అని  సీఎంను ఉద్దేశించి ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. 

This post was last modified on August 15, 2023 3:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

5 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

5 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

9 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

12 hours ago

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…

13 hours ago

నోటాతో పోటిపడ్డ నేతకు జగన్ రెడ్ కార్పెట్

ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…

13 hours ago