Political News

ఏపీలో జ‌నం మూడ్ అంతు చిక్క‌ట్లేదే…!

ఏపీలో 2024లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మార‌నున్నాయి. ప్ర‌ధాన‌మైన మూడు పార్టీల‌కు ఈ ఎన్నిక‌లు అత్యంత ప్రాణ ప్ర‌దంగా కూడా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి.. రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేస్తా మ‌ని.. అదేస‌మ‌యంలో సంక్షేమాన్ని మ‌రింత పెంచుతామ‌ని.. టీడీపీ చెబుతోంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జలే త‌మ‌కు ప‌ట్టం క‌డ‌తార‌ని.. దేశంలోని ఏ రాష్రంలోనూ అమ‌లు కాని విధంగా ఇక్క‌డ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని వైసీపీ చెబుతోంది.

ఇక‌, మ‌రో పార్టీ జ‌న‌సేన‌.. జ‌గ‌న్‌ను గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంది?  వారు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు?  అనేది ఆస‌క్తిగా మారింది. ఈ విష‌యంలో ఏ పార్టీకి కూడా ప్ర‌జ‌ల నాడి తెలియ‌డం లేదనేది గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ఏ పార్టీ త‌ర‌ఫున నాయ‌కులు.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లినా.. ప్ర‌జ‌లు వారికే జై కొడుతున్నారు. ఎవ‌రు స‌భ పెట్టినా.. భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల మూడ్‌ను ప‌సిగ‌ట్ట‌డం పార్టీల‌కు త‌ల‌కు మించిన భారంగానే మారింద‌ని చెప్పాలి.

ఈ క్ర‌మంలో తాజాగా టీడీపీ, వైసీపీలు.. ఎన్నిక‌ల స‌ర్వేకు రెడీ అవుతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ స‌ర్వే ద్వారా.. ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంది?  వారు ఏం కోరుకుంటున్నారు?  క్షేత్ర‌స్థాయిలో పార్టీపై ఎలాంటి చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే నియోజ‌క‌వ‌ర్గాలు ఎన్ని?  అనే కీల‌క విష‌యాల‌పై ఈ స‌ర్వే సాగ‌నున్న‌ట్టు స‌మాచారం. త‌ద్వారా వ‌చ్చే ఫీడ్ బ్యాక్‌ను అనుస‌రించి.. వైసీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను వండి వార్చాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

అదేవిధంగా టీడీపీ అయితే.. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన మినీ మేనిఫెస్టో స్థానంలో మ‌రిన్ని ప‌థ‌కాలు జోడించి.. మేనిఫెస్టోను తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్టు ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. చిత్రం ఏంటంటే.. ఒక‌వైపు వైసీపీ అనేక ప‌థ‌కాలు ఇస్తున్నామ‌ని.. చెబుతున్నా, మ‌రోవైపు టీడీపీ నిరంత‌రం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నా..  జ‌న‌సేనాని అప్పుడ‌ప్పుడు వ‌చ్చి.. బాంబులు పేలుస్తున్నా.. జ‌నం నాడిని మాత్రం ప‌ట్టుకోలేక పోతుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 15, 2023 3:52 pm

Share

Recent Posts

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

6 minutes ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

27 minutes ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

1 hour ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

3 hours ago

ర‌వితేజ‌కు పుత్రికోత్సాహం

స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మార‌డం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావ‌డం అరుదు. ఐతే సినీ…

4 hours ago

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

7 hours ago