Political News

ఏపీలో జ‌నం మూడ్ అంతు చిక్క‌ట్లేదే…!

ఏపీలో 2024లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మార‌నున్నాయి. ప్ర‌ధాన‌మైన మూడు పార్టీల‌కు ఈ ఎన్నిక‌లు అత్యంత ప్రాణ ప్ర‌దంగా కూడా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి.. రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేస్తా మ‌ని.. అదేస‌మ‌యంలో సంక్షేమాన్ని మ‌రింత పెంచుతామ‌ని.. టీడీపీ చెబుతోంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జలే త‌మ‌కు ప‌ట్టం క‌డ‌తార‌ని.. దేశంలోని ఏ రాష్రంలోనూ అమ‌లు కాని విధంగా ఇక్క‌డ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని వైసీపీ చెబుతోంది.

ఇక‌, మ‌రో పార్టీ జ‌న‌సేన‌.. జ‌గ‌న్‌ను గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంది?  వారు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు?  అనేది ఆస‌క్తిగా మారింది. ఈ విష‌యంలో ఏ పార్టీకి కూడా ప్ర‌జ‌ల నాడి తెలియ‌డం లేదనేది గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ఏ పార్టీ త‌ర‌ఫున నాయ‌కులు.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లినా.. ప్ర‌జ‌లు వారికే జై కొడుతున్నారు. ఎవ‌రు స‌భ పెట్టినా.. భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల మూడ్‌ను ప‌సిగ‌ట్ట‌డం పార్టీల‌కు త‌ల‌కు మించిన భారంగానే మారింద‌ని చెప్పాలి.

ఈ క్ర‌మంలో తాజాగా టీడీపీ, వైసీపీలు.. ఎన్నిక‌ల స‌ర్వేకు రెడీ అవుతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ స‌ర్వే ద్వారా.. ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంది?  వారు ఏం కోరుకుంటున్నారు?  క్షేత్ర‌స్థాయిలో పార్టీపై ఎలాంటి చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే నియోజ‌క‌వ‌ర్గాలు ఎన్ని?  అనే కీల‌క విష‌యాల‌పై ఈ స‌ర్వే సాగ‌నున్న‌ట్టు స‌మాచారం. త‌ద్వారా వ‌చ్చే ఫీడ్ బ్యాక్‌ను అనుస‌రించి.. వైసీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను వండి వార్చాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

అదేవిధంగా టీడీపీ అయితే.. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన మినీ మేనిఫెస్టో స్థానంలో మ‌రిన్ని ప‌థ‌కాలు జోడించి.. మేనిఫెస్టోను తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్టు ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. చిత్రం ఏంటంటే.. ఒక‌వైపు వైసీపీ అనేక ప‌థ‌కాలు ఇస్తున్నామ‌ని.. చెబుతున్నా, మ‌రోవైపు టీడీపీ నిరంత‌రం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నా..  జ‌న‌సేనాని అప్పుడ‌ప్పుడు వ‌చ్చి.. బాంబులు పేలుస్తున్నా.. జ‌నం నాడిని మాత్రం ప‌ట్టుకోలేక పోతుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 15, 2023 3:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

3 hours ago

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

4 hours ago

స్లమ్ డాగ్ మేలుకుంటే బాగుండేది

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…

10 hours ago

చరణ్ క్లారిటీ ఇస్తేనే చిరు బయటపడేది

మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…

12 hours ago

ఫ్రెష్షుగా టార్గెట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్

స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…

12 hours ago

అలాంటి మ్యాజిక్.. ఇంకోసారి సాధ్యమేనా?

గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…

13 hours ago