Political News

ఇద్దరి గురి యువత మీదేనా ?

రాబోయే ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల తరపున యువతే ఎక్కువగా పోటీలోకి దిగే అవకాశాలు కనబడుతున్నాయి. టికెట్లలో 40 శాతం యువతకే కేటాయించబోతున్నట్లు చంద్రబాబునాయుడు చాలాకాలం క్రితమే ప్రకటించారు. చంద్రబాబు లెక్కప్రకారం 40 శాతం అంటే 70 నియోజకవర్గాలు. మరి ఇన్ని టికెట్లను యువతకు కేటాయించటం సాధ్యమేనా అన్నది చూడాలి. యువత అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే సీనియర్ల వారసులు, పూర్తిగా కొత్త నేతలే యువత అని అనుకుంటున్నారు. సరే పద్ధతి ఏదైనా యువతకు ఎక్కువ టికెట్లివ్వటం మంచి పరిణామమే కదా.

ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి దృష్టికూడా యువత మీదే నిలిచిందని సమాచారం. రాబోయే ఎన్నికల్లో కనీసం 40 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంఎల్ఏలకు టికెట్లు దక్కే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. అందుకనే సిట్టింగుల స్థానంలో కొత్త అభ్యర్ధులను అందులోను యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇక్కడ కూడా వారసులేనా లేకపోతే పూర్తిగా కొత్త ముఖాలా అనే చర్చ మొదలైంది. అయితే వారసులకు అవకాశాలు తక్కువని సమాచారం.

ఎందుకంటే సిట్టింగులకు టికెట్లిచ్చినా లేదా వాళ్ళ వారసులకు టికెట్లిచ్చినా రిజల్టు ఒకటేలాగ ఉంటుందని జగన్ క ఫీడ్ బ్యాక్ వచ్చిందట. వివిధ కారణాలతో వారసులకు మీద జనాలకున్న కోపాన్ని చల్లార్చాలంటే పూర్తిగా కొత్తవాళ్ళని పోటీలోకి దింపితేనే గెలుపు అవకాశాలున్నాయని సర్వేల్లో తేలిందట. అందుకనే వారసులకు టికెట్లు ఇచ్చే విషయంలో జగన్ పెద్దగా సుముఖంగా లేరని సమాచారం.

ఎలాగూ కొత్తముఖాలు పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటందని కూడా జగన్ అనుకుంటున్నారట. ఎందుకంటే రాష్ట్రంలో యువత ఓట్లు ఎక్కువగానే ఉన్నాయట.  యువత ఓట్లను ఆకర్షించాలంటే పార్టీల తరపున టికెట్లను యువతకు కేటాయించటమే మార్గమని జగన్, చంద్రబాబు అనుకున్నట్లున్నారు. మరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమిచేస్తారో తెలీటంలేదు. నిజానికి ఈ పార్టీ తరపున పోటీచేసేందుకు సీనియర్లు పెద్దగా లేరు. కాబట్టి కచ్చితంగా యువతకే పవన్ టికెట్లు కేటాయించి తీరాలి. 

Satya

Recent Posts

శ్రీశ్రీ… ఇది కదా కావాల్సింది

సినిమాని ఎంత బాగా తీశామో దానికి అంతే మంచి టైటిల్ పెట్టడం ఎంతో అవసరం. ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయిన…

16 minutes ago

గూఢచారి 2 మీద బరువు పెరిగింది

బాలీవుడ్ లో స్పై డ్రామాలకు గడ్డు కాలం వచ్చేసింది. దురంధర్ పుణ్యమాని ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు పెట్టి…

4 hours ago

టీడీపీని చూసైనా నేర్చుకోవాలి క‌దా!

జ‌న‌సేన నాయ‌కుల‌కు ఆ పార్టీ అధినేత చెబితే చెవికి ఎక్క‌డం లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న…

6 hours ago

కేటీఆర్ పాద‌యాత్ర పోస్ట్ పోన్‌… ?

తెలంగాణ‌లో మూడోసారి బీఆర్ఎస్ ప్ర‌భుత్వ ఏర్పాటే ల‌క్ష్యంగా ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పాద‌యాత్ర చేస్తాన‌ని…

9 hours ago

ఎంజిఆర్ ఎన్టీఆర్ తర్వాత విజయ్ అందుకున్నాడు

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కొత్త సినిమా రిలీజ్ కావడం అనేది చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. ఆ…

12 hours ago

లెనిన్ తీర్చాల్సిన బాకీలు ఎన్నో

రేపు లెనిన్ విడుదల కానుంది. ఉదయం అయిదు గంటల నుంచి షోలు మొదలవుతాయని నిర్మాణ సంస్థ ప్రకటించింది కానీ దాదాపు…

14 hours ago