ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ దెబ్బ తగలనుందా? ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన గన్నవరం నియోజ కవర్గంలో పార్టీ మరింత బలహీన పడనుందా? ఇక్కడ కీలక నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు తన దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారా? అంటే.. ఔననే అంటున్నారు స్థానిక నేతలు. 2019 ఎన్నికల్లో యార్లగడ్డ.. వైసీపీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, అప్పటి టీడీపీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ మద్దతుదారుగా ఉన్న వల్లభనేని వంశీ ఇక్కడ విజయం దక్కించుకున్నారు.
ఎన్నికలు అయ్యాక.. రెండు మూడు మాసాలకే.. ఆయన టీడీపీని విడిచి.. వైసీపీ పంచన చేరారు. అధికా రికంగా పార్టీ కండువా కప్పుకోకపోయినా.. వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున వంశీ ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారు. అయితే.. ఆది నుంచి ఇక్కడ వైసీపీని డెవలప్ చేశామని.. తమకే టికెట్ ఇవ్వాలని యార్లగడ్డ కొన్నాళ్లుగా చెవిలో జోరీగలా రగడ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు బహిరంగ వ్యాఖ్యలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
అయినప్పటికీ.. వైసీపీ అధిష్టానం.. వెంకట్రావుకు ఎలాంటి అభయం ఇవ్వలేదు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యార్లగడ్డ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఆయన త్వరలోనే టీడీపీ కండువా కప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీకి ఇక్కడ ఇంచార్జి లేకపోవడం.. గతంలో ఉన్న బచ్చుల అర్జునుడు మృతి చెందిన దరిమిలా.. యార్లగడ్డ టీడీపీవైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర త్వరలోనే గన్నవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ…. త్వరలో లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకొంటున్నారని సమాచారం! ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి.. బెంజిసర్కిల్ నుంచి గన్నవరం వరకూ ర్యాలీ నిర్వహించి.. తన సత్తా నిరూపించాలని భావిస్తున్నట్టు ఆయన వర్గం నాయకులు లీకులు ఇస్తున్నారు. ఇదే జరిగితే.. ఎమ్మెల్యే వంశీ గెలుపు ఈ సారి అంత ఈజీకాదనే వాదన వినిపిస్తోంది.
This post was last modified on August 12, 2023 1:45 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…