Political News

ప‌వ‌న్ గెలుపు కోరుకున్న గ‌ద్ద‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించి.. సీఎం పీఠం అధిరోహించాల‌న్న‌ది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌క్ష్యం. అందుకు  పొత్తుల‌కు కూడా ఆయ‌న వెనుకాడ‌డం లేదు. మ‌రోవైపు వారాహి యాత్ర కూడా ప‌వ‌న్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందేందుకు ప‌వ‌న్ స‌రైన వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దివంగ‌త గ‌ద్ద‌ర్ గురించి ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తి రేపుతున్నాయి.

ప్ర‌జా గాయ‌కుడు, ఉద్య‌మ గొంతుక గ‌ద్ద‌ర్ ఇటీవ‌ల మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. పాట‌తోనే ప్ర‌యాణం చేసి.. పీడిత ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డ్డ గ‌ద్ద‌ర్ అనారోగ్యంతో ఆసుప‌త్రిలో మ‌ర‌ణించారు. అంత‌కంటే ముందు ఆసుప‌త్రిలో గ‌ద్ద‌ర్‌ను ప‌వ‌న్ క‌లిసిన విష‌యం విదిత‌మే. ఆసుప‌త్రిలో గ‌ద్ద‌ర్‌ను ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్‌.. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. కానీ గ‌ద్ద‌ర్ అనారోగ్యం క్షీణించి తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు.

గ‌ద్ద‌ర్‌తో చివ‌రి సారిగా మాట్లాడిన మాట‌ల‌ను ప‌వ‌న్ తాజాగా బ‌య‌ట‌పెట్టారు. త‌న గెలుపును గ‌ద్ద‌ర్‌ కోరుకున్నార‌ని ప‌వ‌న్ చెప్పారు. గ‌ద్ద‌ర్ మాట్లాడిన చివ‌రి మాట‌ల‌ను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాన‌ని అన్నారు. కాలం చాలా గొప్ప‌ది, దాని ముందు ఎవ‌రైనా మోకారిల్లాల్సిందేన‌ని గ‌ద్ద‌ర్ చెప్పారు. దేశంలో ప్ర‌స్తుతం 60 శాతం మంది యువ‌త ఉన్నార‌ని, వారికి స‌రైన నాయ‌క‌త్వం వ‌హించే నాయ‌కుడు కావాల‌ని గ‌ద్ద‌ర్ అన్నార‌ని ప‌వ‌న్ చెప్పారు. ఈ త‌రానికి స‌రైన మార్గ‌నిర్దేశ‌నం ఇస్తావ‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని గ‌ద్ద‌ర్ అన్నార‌న్నారు. అంతే కాకుండా తాను విజ‌యం సాధించాల‌ని గ‌ద్ద‌ర్ కోరుకున్నార‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. మ‌రి గ‌ద్ద‌ర్ అన్న‌ట్లు ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నికల్లో ఏపీలో విజ‌యం సాధిస్తారేమో చూడాలి. 

Satya

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

13 minutes ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

1 hour ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

1 hour ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

3 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

3 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago