ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి.. సీఎం పీఠం అధిరోహించాలన్నది జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యం. అందుకు పొత్తులకు కూడా ఆయన వెనుకాడడం లేదు. మరోవైపు వారాహి యాత్ర కూడా పవన్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజల ఆదరణ పొందేందుకు పవన్ సరైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత గద్దర్ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
ప్రజా గాయకుడు, ఉద్యమ గొంతుక గద్దర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. పాటతోనే ప్రయాణం చేసి.. పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ గద్దర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించారు. అంతకంటే ముందు ఆసుపత్రిలో గద్దర్ను పవన్ కలిసిన విషయం విదితమే. ఆసుపత్రిలో గద్దర్ను పరామర్శించిన పవన్.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కానీ గద్దర్ అనారోగ్యం క్షీణించి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
గద్దర్తో చివరి సారిగా మాట్లాడిన మాటలను పవన్ తాజాగా బయటపెట్టారు. తన గెలుపును గద్దర్ కోరుకున్నారని పవన్ చెప్పారు. గద్దర్ మాట్లాడిన చివరి మాటలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అన్నారు. కాలం చాలా గొప్పది, దాని ముందు ఎవరైనా మోకారిల్లాల్సిందేనని గద్దర్ చెప్పారు. దేశంలో ప్రస్తుతం 60 శాతం మంది యువత ఉన్నారని, వారికి సరైన నాయకత్వం వహించే నాయకుడు కావాలని గద్దర్ అన్నారని పవన్ చెప్పారు. ఈ తరానికి సరైన మార్గనిర్దేశనం ఇస్తావని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని గద్దర్ అన్నారన్నారు. అంతే కాకుండా తాను విజయం సాధించాలని గద్దర్ కోరుకున్నారని పవన్ పేర్కొన్నారు. మరి గద్దర్ అన్నట్లు పవన్ వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయం సాధిస్తారేమో చూడాలి.
This post was last modified on August 11, 2023 11:20 pm
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…
ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…