జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫుల్ జోష్లో ఉన్నారు. మూడో విడత వారాహి విజయయాత్రలో వైసీపీ ప్రభుత్వంపై, జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు అన్నయ్య చిరంజీవి, మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతుగా నిలవడంతో పవన్ మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయం నాటికి మెగా కుటుంబం నుంచి ఒక్కొక్కరిగా పవన్కు అండగా నిలిచేందుకు ముందుకు వస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జనసేన కార్యకర్తలు సంతోషంలో మునిగిపోతున్నారనే చెప్పాలి.
పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి చిరంజీవి పెద్దగా రాజకీయాల గురించి కానీ, పవన్ పొలిటికల్ విషయాల గురించి కానీ బయట మాట్లాడలేదు. కానీ ఇటీవల యాక్టర్ల రెమ్యునరేషన్ గురించి ప్రభుత్వాలకు ఎందుకు, రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక హోదా, రోడ్లు, ప్రజల గురించి పట్టించుకోవాలని చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు కూడా తీవ్రంగానే స్పందించడంతో పొలిటికల్ హీట్ ఏర్పడింది. మరోవైపు తమ్ముడికి చిరంజీవి మద్దతుగా రావడంతో జనసేన కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి.
ఇప్పుడిక పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ రాజకీయంగా పవన్కు మద్దతునిస్తూనే ఉంటానని వెల్లడించారు. సమాజం కోసం పవన్ పనిచేస్తున్నారని చెప్పారు. పిల్లలను, కుటుంబాలను రాజకీయాల్లోకి లాగొద్దని కూడా పేర్కొన్నారు. ఇన్ని రోజులు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ పవన్పై వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది. ఇప్పుడీ విషయంపై రేణు దేశాయ్ స్పందించడంతో వైసీపీ నేతలకు చెక్ పెట్టినట్లు అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని పక్కనపెట్టి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వాలని రేణు కోరారు. మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపాలని, నలుగురు పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దని కూడా ఆమె చెప్పారు.
This post was last modified on August 11, 2023 7:37 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…