పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అంతర్గత సమావేశం కానున్నారు. రుషి కొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో జనసేనాని చర్చించనున్నారు. అలాగే వైజాగ్ లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అయితే పవన్ ఫీల్డ్ విజిట్స్ పై ఉత్కంఠ నెలకొంది. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడికీ వెళ్ల రాదని ఆంక్షలు విధించారు పోలీసులు. అలాగే వైజాగ్ లో వారాహి విజయోత్సవ రెండో రోజు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను జనసేన టీమ్ రిలీజ్ చేయనుంది. ఇక విశాఖ పర్యటనలో పలువురు పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా వైజాగ్ లో వారాహి మూడో దశ యాత్రను గురువారం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ యాత్రకి వినూత్న స్పందన వచ్చింది. జగదాంబ సెంటర్ లో అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కావాలని తాను అనుకుంటే సరిపోదని.. మీరు కూడా దానికి సపోర్ట్ చేయాలని అన్నారు. నేను వైసీపీ గురించి ఒక్క మాట మాట్లాడితే వారు గయ్యిన లేస్తున్నారని విమర్శించారు. దోపిడీలు చేసే వాళ్లకే ఇంత ధైర్యం ఉంటే రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తున్న నాకు ఇంకేంత ధైర్యం ఉండాలని జనసేనాని ప్రశ్నించారు.
వైసీపీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమికొట్టే వరకూ.. నేను ఉరుకోను అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పార్టీ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. సింహద్రి సాక్షి చెప్తున్నా.. వాలంటీర్లను నేను తప్పపట్టడం లేదు.. వారి మీద ద్వేషమూ లేదు. వాలంటీర్లతో జగన్ తప్పులు చేయిస్తున్నాడని అన్నారు. గంజాయికి అడ్డగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారిపోయిందన్నారు. కేంద్రంతో ఒక రోజు జగన్ ను ఆట ఆడిస్తానని పేర్కొన్నారు పవన్. జగన్ కి మరొక అవకాశం ఇస్తారా? లేదో ఆలోచించుకోండని అన్నారు. గత పర్యటనలో మీరు లేకపోతే వైజాగ్ లో తనను ఏమైనా చేసే వారని అన్నారు. ఈ నేల కోసం ప్రాణాలకు తెగించే వారు కావాలన్నారు పవన్ కళ్యాణ్.
This post was last modified on August 11, 2023 5:37 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…