Political News

రేణు మ‌ద్ద‌తుతో జ‌న‌సేన‌కు ఆ ఓటింగ్ ఫ్ల‌స్ అవుతుందా…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో సంచ‌ల‌న‌మే చోటు చేసుకుంద‌ని చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కుటుంబానికి చెందిన వారు ఎవ‌రూ కూడా నేరుగా బ‌య‌ట‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది లేదు. ఒక్క నాగ‌బాబు మాత్రం పార్టీలో నాయ‌కుడిగా ఉండ‌డం, గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయ‌డం తెలిసిందే. ముఖ్యంగా మెగా కుటుంబానికి చెందిన‌ మ‌హిళ‌లు ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు రాలేదు.

అయితే, తాజాగా ప‌వ‌న్ మాజీ స‌తీమ‌ని రేణూ దేశాయ్‌.. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ట్టు ప్ర‌కటించారు. పవ‌న్ డ‌బ్బుల మ‌నిషి కాద‌ని, ఆయ‌న ప్ర‌జ‌ల కోస‌మే సినిమాల‌ను, కుటుంబాన్ని, కుటుంబ స‌భ్యుల‌ను కూడా ప‌క్క‌న పెట్టి వ‌చ్చార‌ని చెప్పారు. ప్ర‌జ‌లంతా కూడా.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఉండాల‌ని రేణూ వ్యా ఖ్యానించారు. తాను ప‌వ‌న్‌కు ద‌న్నుగా ఉంటాన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక్క‌ఛాన్స్ ఇవ్వాలంటూ.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ త‌ర‌ఫున విజ్ఞ‌ప్తి చేశారు.

క‌ట్ చేస్తే.. రేణూ దేశాయ్ ఇచ్చిన పిలుపుతో జ‌న‌సేన‌కు ఏమేర‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌నేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళా ఓటు బ్యాంకు విష‌యంలో ప‌వ‌న్ పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. రాష్ట్రం లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నా.. ఎవ‌రు అధికారంలోకి రావాల‌న్నా.. మ‌హిళా ఓటు బ్యాంకు అత్యంత కీల‌కం. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా ఇప్పుడు రేణు చేసిన వ్యాఖ్య‌లు మ‌హిళా కోణం చూసుకుంటే ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతాయ‌నేది ఆసక్తిగా మారింది.

నిజానికి మ‌హిళా ఓటు బ్యాంకును ఇటు వైసీపీ, అటు టీడీపీ కూడా పంచుకుంటున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా వైసీపీకి ద‌క్కింద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు మ‌హిళ మ‌హా శ‌క్తి పేరుతో టీడీపీ ఈ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో రేణు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేస్తే.. జ‌న‌సేన వైపు కూడా మ‌హిళ‌లు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఆ దిశ‌గా అడుగులు ప‌డ‌తాయో లేదో చూడాలి.

This post was last modified on August 11, 2023 3:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

5 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

8 hours ago