Political News

రేణు మ‌ద్ద‌తుతో జ‌న‌సేన‌కు ఆ ఓటింగ్ ఫ్ల‌స్ అవుతుందా…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో సంచ‌ల‌న‌మే చోటు చేసుకుంద‌ని చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కుటుంబానికి చెందిన వారు ఎవ‌రూ కూడా నేరుగా బ‌య‌ట‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది లేదు. ఒక్క నాగ‌బాబు మాత్రం పార్టీలో నాయ‌కుడిగా ఉండ‌డం, గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయ‌డం తెలిసిందే. ముఖ్యంగా మెగా కుటుంబానికి చెందిన‌ మ‌హిళ‌లు ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు రాలేదు.

అయితే, తాజాగా ప‌వ‌న్ మాజీ స‌తీమ‌ని రేణూ దేశాయ్‌.. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ట్టు ప్ర‌కటించారు. పవ‌న్ డ‌బ్బుల మ‌నిషి కాద‌ని, ఆయ‌న ప్ర‌జ‌ల కోస‌మే సినిమాల‌ను, కుటుంబాన్ని, కుటుంబ స‌భ్యుల‌ను కూడా ప‌క్క‌న పెట్టి వ‌చ్చార‌ని చెప్పారు. ప్ర‌జ‌లంతా కూడా.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఉండాల‌ని రేణూ వ్యా ఖ్యానించారు. తాను ప‌వ‌న్‌కు ద‌న్నుగా ఉంటాన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక్క‌ఛాన్స్ ఇవ్వాలంటూ.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ త‌ర‌ఫున విజ్ఞ‌ప్తి చేశారు.

క‌ట్ చేస్తే.. రేణూ దేశాయ్ ఇచ్చిన పిలుపుతో జ‌న‌సేన‌కు ఏమేర‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌నేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళా ఓటు బ్యాంకు విష‌యంలో ప‌వ‌న్ పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. రాష్ట్రం లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నా.. ఎవ‌రు అధికారంలోకి రావాల‌న్నా.. మ‌హిళా ఓటు బ్యాంకు అత్యంత కీల‌కం. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా ఇప్పుడు రేణు చేసిన వ్యాఖ్య‌లు మ‌హిళా కోణం చూసుకుంటే ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతాయ‌నేది ఆసక్తిగా మారింది.

నిజానికి మ‌హిళా ఓటు బ్యాంకును ఇటు వైసీపీ, అటు టీడీపీ కూడా పంచుకుంటున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా వైసీపీకి ద‌క్కింద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు మ‌హిళ మ‌హా శ‌క్తి పేరుతో టీడీపీ ఈ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో రేణు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేస్తే.. జ‌న‌సేన వైపు కూడా మ‌హిళ‌లు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఆ దిశ‌గా అడుగులు ప‌డ‌తాయో లేదో చూడాలి.

This post was last modified on August 11, 2023 3:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…

15 minutes ago

రజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…

1 hour ago

క్లిక్ అయితే శ్రీవిష్ణు పంట పండినట్టే

రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…

2 hours ago

ఓయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది?

బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…

3 hours ago

థియేటర్ VS ఓటిటి – గ్యాప్ నిజంగా తగ్గించగలరా

థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago