ఉత్తరాంధ్రలో జనసేన బలం పెరుగుతున్నదా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీమంత్రి పడాల అరుణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈమె జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. మూడుసార్లు కూడా టీడీపీ తరపునే గెలిచారు. అలాగే ఈ మధ్యనే పంచకర్ల రమేష్ కూడా జనసేనలో చేరిన విషయం తెలిసిందే.
రమేష్ కూడా రెండు సార్లు ఎంఎల్ఏగా పనిచేశారు. మొదటి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి నుండి గెలిచారు. తర్వాత 2014లో ఇదే జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ తరపున గెలిచారు. ఇంతకాలం వైసీపీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన రమేష్ జనసేనలో జాయిన్ అయ్యారు. అంటే విశాఖపట్నం జిల్లాలోను, విజయనగరం జిల్లాలోను చెరో నేత చేరారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఎవరెవరు జనసేనలో చేరుతారో అనే చర్చ ఊపందుకుంది.
పార్టీలో జరుగుతున్న చర్చ ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తమకు కచ్చితంగా టికెట్ రాదని తీర్మానించుకున్న వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏలు లేదా సీనియర్ నేతలు జనసేనలో చేరే అవకాశాలున్నాయట. టీడీపీ, జనసేన పొత్తుంటే తాము చేర్చుకుంటున్న నేతలకు పోటీచేసే అవకాశం ఉందా లేదా అన్నది స్క్రీనింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే చేరికలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. ఒకవేళ పొత్తులు లేకపోతే అందరికీ హ్యాపీయే.
మామూలుగా అయితే 175 నియోజకవర్గాల్లోను జనసేన గట్టి అభ్యర్ధులను వెతుక్కోవాల్సిందే. కాకపోతే బీజేపీ మిత్రపక్షంగా ఉందికాబట్టి తక్కువల తక్కువ 120 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్దులను వెతుక్కోవాల్సుంటుంది. అప్పుడు పంచకర్ల రమేష్, పడాల అరుణ లాంటి చాలామందికి టికెట్లు దక్కుతాయి. అందుకనే పార్టీ బలోపేతానికి పవన్ వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే వారాహియాత్ర మొదలైన తూర్పుగోదావరి జిల్లాల్లో గట్టి నేతలు ఎవరు పార్టీలో చేరలేదు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోను చేరలేదు. అలాంటిది విశాఖ పర్యటనలో చేరుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.
This post was last modified on August 11, 2023 1:11 pm
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…