Political News

జ‌న‌సేన‌ బేరం.. అమ్మేయాల‌నుకున్నారు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు, శాంతి దూత‌గా పేర్కొనే కిలారి ఆనంద‌పాల్‌.. తాజాగా జ‌న‌సేన‌పై సంచ‌ల న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీని అమ్మేయాల‌ని బేరం పెట్టా ర‌ని.. ఏకంగా 5000 కోట్ల రూపాయ‌ల‌కు బీజేపీ అమ్మేయాల‌ని భావించార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యంపై చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ చ‌ర్చించుకున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు.

విజ‌య‌వాడ‌లో తాజాగా ప‌ర్య‌టించిన పాల్‌.. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. “నేను మొద‌టి నుంచి చెబుతూనే ఉన్నాను. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పార్టీ న‌డ‌ప‌డం చేత‌కాదు. అందుకే జ‌న‌సేనను బీజేపీలో క‌లిపేయాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి నా ద‌గ్గ‌ర ఆధారాలు కూడా ఉన్నాయి. చిరంజీవి-ప‌వ‌న్ ఇద్ద‌రూ క‌లిసి.. జ‌న‌సేన‌ను బీజేపీలో క‌లిపేయాల‌ని చూస్తున్నారు. 5000 కోట్ల‌కు అమ్మేయాల‌ని  చూస్తున్నారు“ అని పాల్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఈ మొత్తం వ్య‌వ‌హారం వెనుక‌.. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించిన చిరంజీవి బావ‌మ‌రిది అల్లు అర‌వింద్ కీల‌క పాత్ర పోషించార‌ని పాల్ చెప్పుకొచ్చారు. జ‌న‌సేన‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని కూడా పాల్ పిలుపునిచ్చారు. “త‌మ్ముడు ప్ర‌స్తుతం వారాహి  యాత్రల కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు.అయితే.. ఈ యాత్ర ఆయ‌న కోసం అనుకుంటున్నారా?  కాదు.. మోడీని మ‌రోసారి ఢిల్లీలో గ‌ద్దె ఎక్కించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు“ అని పాల్ అన్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని, పోల‌వ‌రం నిర్మించ‌ని, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ క‌ట్టించ‌ని.. మోడీకి ప‌వ‌న్ గులాం గిరీ చేస్తున్నాడు. ఆయ‌న‌కు ఓటేయాల‌ని మ‌న‌కు చెబుతున్నాడు.  అది వారాహి యాత్ర కాదు.. మోడీ కోసం చేసే యాత్ర. జనసేనకు ఒక్క ఓటేసినా మోడీకి ఓటేసినట్లే. కాబ‌ట్టి త‌మ్ముడు ప‌వ‌న్‌ను న‌మ్మొద్దు“ అని పాల్ వ్యాఖ్యానించారు. 

This post was last modified on August 10, 2023 10:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలివిగా ప్లాన్ చేసుకుంటున్న జన నాయకుడు

జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…

36 minutes ago

తెలంగాణలో రేపటినుండి ‘ముక్క’ దొరకదు

ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…

1 hour ago

దురంధర్ 2 డౌన్ అవ్వడానికి కారణాలేంటి

హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…

2 hours ago

టొవినో డ్రాపయ్యాడు… డ్రాగన్ నో అన్నాడు

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…

3 hours ago

అనుష్కని కాసేపే చూపిస్తే ఎలా

https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…

4 hours ago

త్రివిక్రమ్… ఆ ఒక్క సీన్‌లో అసలైన స్టఫ్?

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…

4 hours ago