Political News

జ‌న‌సేన‌ బేరం.. అమ్మేయాల‌నుకున్నారు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు, శాంతి దూత‌గా పేర్కొనే కిలారి ఆనంద‌పాల్‌.. తాజాగా జ‌న‌సేన‌పై సంచ‌ల న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీని అమ్మేయాల‌ని బేరం పెట్టా ర‌ని.. ఏకంగా 5000 కోట్ల రూపాయ‌ల‌కు బీజేపీ అమ్మేయాల‌ని భావించార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యంపై చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ చ‌ర్చించుకున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు.

విజ‌య‌వాడ‌లో తాజాగా ప‌ర్య‌టించిన పాల్‌.. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. “నేను మొద‌టి నుంచి చెబుతూనే ఉన్నాను. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పార్టీ న‌డ‌ప‌డం చేత‌కాదు. అందుకే జ‌న‌సేనను బీజేపీలో క‌లిపేయాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి నా ద‌గ్గ‌ర ఆధారాలు కూడా ఉన్నాయి. చిరంజీవి-ప‌వ‌న్ ఇద్ద‌రూ క‌లిసి.. జ‌న‌సేన‌ను బీజేపీలో క‌లిపేయాల‌ని చూస్తున్నారు. 5000 కోట్ల‌కు అమ్మేయాల‌ని  చూస్తున్నారు“ అని పాల్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఈ మొత్తం వ్య‌వ‌హారం వెనుక‌.. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించిన చిరంజీవి బావ‌మ‌రిది అల్లు అర‌వింద్ కీల‌క పాత్ర పోషించార‌ని పాల్ చెప్పుకొచ్చారు. జ‌న‌సేన‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని కూడా పాల్ పిలుపునిచ్చారు. “త‌మ్ముడు ప్ర‌స్తుతం వారాహి  యాత్రల కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు.అయితే.. ఈ యాత్ర ఆయ‌న కోసం అనుకుంటున్నారా?  కాదు.. మోడీని మ‌రోసారి ఢిల్లీలో గ‌ద్దె ఎక్కించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు“ అని పాల్ అన్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని, పోల‌వ‌రం నిర్మించ‌ని, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ క‌ట్టించ‌ని.. మోడీకి ప‌వ‌న్ గులాం గిరీ చేస్తున్నాడు. ఆయ‌న‌కు ఓటేయాల‌ని మ‌న‌కు చెబుతున్నాడు.  అది వారాహి యాత్ర కాదు.. మోడీ కోసం చేసే యాత్ర. జనసేనకు ఒక్క ఓటేసినా మోడీకి ఓటేసినట్లే. కాబ‌ట్టి త‌మ్ముడు ప‌వ‌న్‌ను న‌మ్మొద్దు“ అని పాల్ వ్యాఖ్యానించారు. 

This post was last modified on August 10, 2023 10:26 pm

Share

Recent Posts

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

2 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

4 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

4 hours ago

దేవిలో ఇది గొప్ప లక్షణం

టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…

6 hours ago

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

7 hours ago