Political News

జ‌న‌సేన‌ బేరం.. అమ్మేయాల‌నుకున్నారు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు, శాంతి దూత‌గా పేర్కొనే కిలారి ఆనంద‌పాల్‌.. తాజాగా జ‌న‌సేన‌పై సంచ‌ల న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీని అమ్మేయాల‌ని బేరం పెట్టా ర‌ని.. ఏకంగా 5000 కోట్ల రూపాయ‌ల‌కు బీజేపీ అమ్మేయాల‌ని భావించార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యంపై చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ చ‌ర్చించుకున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు.

విజ‌య‌వాడ‌లో తాజాగా ప‌ర్య‌టించిన పాల్‌.. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. “నేను మొద‌టి నుంచి చెబుతూనే ఉన్నాను. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పార్టీ న‌డ‌ప‌డం చేత‌కాదు. అందుకే జ‌న‌సేనను బీజేపీలో క‌లిపేయాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి నా ద‌గ్గ‌ర ఆధారాలు కూడా ఉన్నాయి. చిరంజీవి-ప‌వ‌న్ ఇద్ద‌రూ క‌లిసి.. జ‌న‌సేన‌ను బీజేపీలో క‌లిపేయాల‌ని చూస్తున్నారు. 5000 కోట్ల‌కు అమ్మేయాల‌ని  చూస్తున్నారు“ అని పాల్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఈ మొత్తం వ్య‌వ‌హారం వెనుక‌.. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించిన చిరంజీవి బావ‌మ‌రిది అల్లు అర‌వింద్ కీల‌క పాత్ర పోషించార‌ని పాల్ చెప్పుకొచ్చారు. జ‌న‌సేన‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని కూడా పాల్ పిలుపునిచ్చారు. “త‌మ్ముడు ప్ర‌స్తుతం వారాహి  యాత్రల కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు.అయితే.. ఈ యాత్ర ఆయ‌న కోసం అనుకుంటున్నారా?  కాదు.. మోడీని మ‌రోసారి ఢిల్లీలో గ‌ద్దె ఎక్కించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు“ అని పాల్ అన్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని, పోల‌వ‌రం నిర్మించ‌ని, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ క‌ట్టించ‌ని.. మోడీకి ప‌వ‌న్ గులాం గిరీ చేస్తున్నాడు. ఆయ‌న‌కు ఓటేయాల‌ని మ‌న‌కు చెబుతున్నాడు.  అది వారాహి యాత్ర కాదు.. మోడీ కోసం చేసే యాత్ర. జనసేనకు ఒక్క ఓటేసినా మోడీకి ఓటేసినట్లే. కాబ‌ట్టి త‌మ్ముడు ప‌వ‌న్‌ను న‌మ్మొద్దు“ అని పాల్ వ్యాఖ్యానించారు. 

This post was last modified on August 10, 2023 10:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

28 minutes ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

3 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

4 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

5 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

6 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

7 hours ago