జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు(గురువారం) నుంచి చేపట్టనున్న వారాహి యాత్ర 3.0పై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎక్కడా రోడ్ షో చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. అదేవిధంగా అభిమానులతో కలిసి కరచాలనాలు.. వాహనం(ఓపెన్ టాప్)పైకి ఎక్కి అభివాదాలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలోనూ ఎవరినీ కలిసేందుకు, అభివాదాలు, నినాదాలు చేసేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు.
అలానే, విశాఖ విమానాశ్రయం నుంచి కేవలం పోర్టు రోడ్డు ద్వారా మాత్రమే పవన్ కాన్వాయ్ వెళ్లాలని.. కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఎలాంటి ఆర్భాటాలు, నినాదాలు.. జెండా ఎగరవేతలు ఉండేందుకు వీల్లేదని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విమానాశ్రయం నుంచి నేరుగా జగదాంబ సెంటర్కు చేరుకుని అక్కడ సభ నిర్వహించుకునేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు విశాఖపట్నం పోలీసు కమిషనర్ కార్యాలయం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.
అదేసమయంలో పవన్ సభకు వచ్చేవారికి పాస్లు మంజూరు చేయాలని ఒక్కపాస్పై కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీలు చేసి.. పాస్లేని వారిని అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందని పేర్కొన్నారు. కాగా, ఈ రోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు కూడా పవన్ వారాహి యాత్రను నిర్వహించనున్నారు. విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన యాత్ర సాగనుందని జనసేన వర్గాలు తెలిపాయి.
This post was last modified on August 10, 2023 12:42 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…