చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు ప్రాంతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యా నేరం కేసు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తనపై పెట్టిన కేసు వ్యవహారంపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. అంగళ్లు ఘర్షణల నేపథ్యంలో తనపై కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. అంగళ్లులో తనను హత్య చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ఆ హత్యాయత్నానికి పోలీసుల సహకారం కూడా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
టీడీపీ క్యాడర్ పై కూడా దాడులు చేస్తున్నారని, ఇప్పుడు తనపై కూడా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధ నేత సీఎం అయితే వ్యవస్థలు ఇలాగే ఉంటాయని జగన్ పై విమర్శలు గుప్పించారు. తమను చంపి రాజకీయాలు చేస్తారా? ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అని చంద్రబాబు మండిపడ్డారు. అంగళ్లు అల్లర్లపై సిబిఐతో విచారణ జరిపించాలని, తనను చంపడానికి ప్రయత్నించింది ఎవరో విచారణలో తేలాలని డిమాండ్ చేశారు.
సైకో సీఎం ఆదేశాలతోనే తనను రాయలసీమలో పర్యటించనివ్వడం లేదని, ప్రజల తరఫున పోరాడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, ఎక్కడికెళ్లిన తనపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ ఎస్ జి భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే, తానే పారిపోతే ఇక అర్థం ఏముందని ప్రశ్నించారు. వైసిపి అవినీతిని, దోపిడీని దౌర్జన్యాలను ఎదుర్కొని తీరుతానని చంద్రబాబు సవాల్ చేశారు.
మూర్ఖత్వపు పాలనతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడని నిప్పులు చెరిగారు. అబద్దాలకోరు, కరుడుగట్టిన నేరస్థుడు, మూర్ఖుడు, సైకో అందరి జీవితాలను నాశనం చేశాడని ఆరోపించారు. రోడ్లు బాగు చేయలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బాగు చేస్తారా అని ఎద్దేవా చేశారు.దుర్మార్గుడు జగన్ వచ్చాక రాష్ట్రంలో అరాచకం పెరిగిందని దుయ్యబట్టారు. జగన్ వంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని, వైసిపిని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రానికి మోక్షం లభిస్తుందని ప్రజలకు పిలుపునిచ్చారు.
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…