Political News

నాపై హత్యా ప్రయత్నం చేసి కేసు పెడతారా?

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు ప్రాంతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యా నేరం కేసు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తనపై పెట్టిన కేసు వ్యవహారంపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. అంగళ్లు ఘర్షణల నేపథ్యంలో తనపై కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. అంగళ్లులో తనను హత్య చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ఆ హత్యాయత్నానికి పోలీసుల సహకారం కూడా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

టీడీపీ క్యాడర్ పై కూడా దాడులు చేస్తున్నారని, ఇప్పుడు తనపై కూడా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధ నేత సీఎం అయితే వ్యవస్థలు ఇలాగే ఉంటాయని జగన్ పై విమర్శలు గుప్పించారు. తమను చంపి రాజకీయాలు చేస్తారా? ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అని చంద్రబాబు మండిపడ్డారు. అంగళ్లు అల్లర్లపై సిబిఐతో విచారణ జరిపించాలని, తనను చంపడానికి ప్రయత్నించింది ఎవరో విచారణలో తేలాలని డిమాండ్ చేశారు.

సైకో సీఎం ఆదేశాలతోనే తనను రాయలసీమలో పర్యటించనివ్వడం లేదని, ప్రజల తరఫున పోరాడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, ఎక్కడికెళ్లిన తనపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ ఎస్ జి భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే, తానే పారిపోతే ఇక అర్థం ఏముందని ప్రశ్నించారు. వైసిపి అవినీతిని, దోపిడీని దౌర్జన్యాలను ఎదుర్కొని తీరుతానని చంద్రబాబు సవాల్ చేశారు.

మూర్ఖత్వపు పాలనతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడని నిప్పులు చెరిగారు. అబద్దాలకోరు, కరుడుగట్టిన నేరస్థుడు, మూర్ఖుడు, సైకో అందరి జీవితాలను నాశనం చేశాడని ఆరోపించారు. రోడ్లు బాగు చేయలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బాగు చేస్తారా అని ఎద్దేవా చేశారు.దుర్మార్గుడు జగన్ వచ్చాక రాష్ట్రంలో అరాచకం పెరిగిందని దుయ్యబట్టారు. జగన్ వంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని, వైసిపిని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రానికి మోక్షం లభిస్తుందని ప్రజలకు పిలుపునిచ్చారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారత్ సంచలనం : పాకిస్తానీలు దేశం విడిచి వెళ్ళిపోవాలి!

కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను…

1 hour ago

వెంకీ & నాని మల్టీస్టారర్ మిస్సయ్యిందా

పైన హెడ్డింగ్ చదవగానే అరే మిస్సయ్యామే అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. అలాంటిదే అభిమానులు ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్,…

2 hours ago

గుడివాడ వైసీపీ కొలాప్స్ ?

ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు..…

3 hours ago

వీళ్లు మ‌నుషులు కాదు మృగాలు: చంద్ర‌బాబు

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అమ్మ‌న‌బ్రోలుకు చెందిన టీడీపీ నాయ‌కుడు వీర‌య్య చౌద‌రి దారుణ హ‌త్య‌పై సీఎం…

4 hours ago

రాజా సాబ్ కానుక సరే మరి శుభవార్త ?

ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది.…

5 hours ago

“ఎన్టీఆర్ భవన్ కాదండోయ్… ఛార్లెస్ శోభరాజ్ భవన్‌” – నాని

విజ‌య‌వాడ ప్ర‌స్తుత ఎంపీ.. కేశినేని చిన్ని(శివ‌నాథ్‌), మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) ఇద్ద‌రూ తోడ‌బుట్టిన అన్న‌ద‌మ్ములు. రాజ‌కీయంగా వైరం లేక‌పోయినా..…

6 hours ago