Political News

షర్మిల పార్టీ విలీనం ఖాయమైందా?

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపి విలీనం ఖాయమైపోయిందా ? అయ్యిందనే అంటున్నాయి రెండుపార్టీల వర్గాలు. ఈనెల 12 వ తేదీన షర్మిల ఢిల్లీకి వెళ్ళి పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అవుతారని చెబుతున్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపి విలీనం గురించి ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కొంతకాలంగా రెండుపార్టీల మధ్య పొత్తా లేకపోతే విలీనమా అనే విషయమై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

మొదట్లో షర్మిలేమో పొత్తుకు మొగ్గుచూపితే కాంగ్రెస్ నేతలేమో విలీనానికే పట్టుబట్టారు. అయితే రెండు పద్దతుల్లో లాభనష్టాలపై చర్చలు జరిగిన తర్వాత షర్మిల కూడా విలీనానికే సిద్ధపడ్డారు. అయితే షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా చేసి పార్టీ పగ్గాలను అప్పగిస్తామని అధిష్టానం చెప్పింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలోపేతం చేయాలని షరతు విధించింది. అందుకు షర్మిల అంగీకరించలేదు.

రాజకీయాల్లో ఉన్నంతవరకు తాను తెలంగాణాలోనే ఉంటానని స్పష్టంగా చెప్పేశారు. కాదు కూడదంటే అసలు విలీనమూ జరగదు, పొత్తూ అవసరంలేదని తేల్చిచెప్పేశారు. దాంతో అధిష్టానం వెనక్కుతగ్గి షర్మిలను తెలంగాణాలోనే ఉండటానికి అంగీకరించింది. ఇక అప్పుడు రాబోయే ఎన్నికల్లో షర్మిల పోటీ చేయబోయే నియోజకవర్గంపై చర్చలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ స్ధానంలో పోటీ చేసేట్లుగా చర్చలు జరుగుతున్నాయి.

మరీ రెండింటిలో ఏది ఫిక్సవుతుందో తెలీదు కానీ మొత్తానికి విలీనం ముహూర్తమైతే ఫిక్సయిపోయిందట. ఈ మొత్తం వ్యవహారాన్ని  కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివరకుమార్ సమన్వయం చేశారు. అటు అధిష్టానానికి కోపం రాకుండా ఇటు షర్మిలకు ఇబ్బందులు రాకుండా డీకే సమన్వయ బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించినట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. షర్మిల రాకను మొదటి నుండి తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే రేవంత్ అభ్యంతరాలను, వ్యతిరేకతను అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ఇదే సమయంలో కొందరు సీనియర్లు షర్మిల రాకను ఆహ్వానిస్తున్నారు. మరి చివరకు ఎన్నికల్లో ఏమవుతుందనే ఆసక్తి పెరిగిపోతోంది. 

This post was last modified on August 9, 2023 3:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

20 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago