ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో టికెట్ పోరు తారస్థాయికి చేరుకుంది. ఇది భూమా నాగిరెడ్డి కుటుంబంలోనే చిచ్చు రేపుతోందని అంటున్నారు పరిశీలకులు. ఆళ్లగడ్డ విషయం లోను.. నంద్యాల నియోజకవర్గం విషయంలోనూ రేగిన టికెట్ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదని పరిశీలకులు కూడా చెబుతున్నారు. భూమా కుటుంబానికి ఈ సారి ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వాలని.. సీనియర్లు చెబుతున్నారు.
అది కూడా నంద్యాలతో సరిపెట్టాలని అంటున్నారు. ఆళ్లగడ్డ టికెట్ను మాత్రం ఏవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలనే చర్చ సాగుతోంది. దీనికి ఆయన వియ్యంకుడు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కూడా.. మద్దతు ఇస్తున్నారు. ఆళ్లగడ్డలో ఏవీని గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని కూడా బొండా చెబుతున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కావడంతో ఆయన మాటను చంద్రబాబు వింటారనే చర్చ కూడా జరుగుతోంది.
గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ పోటీ చేశారు. అయితే, ఆమె ఓడిపోయారు. ఇప్పుడు కూడా తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే, ఏవీ సుబ్బారెడ్డికి, ఆమెకు మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో..కీలక మలుపు చోటు చేసుకుని.. ఇక్కడి నుంచి తానే పోటీకి దిగుతానంటూ.. తరచుగా నియోజకవర్గం టీడీపీ నాయకులతో ఏవీ సుబ్బారెడ్డి భేటీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అఖిల ప్రియ నిర్వహించిన కార్యక్రమానికి కార్యకర్తలు వెళ్లకుండా కూడా ఆయన నిలువరించారు.
వ్యక్తిగతంగా కూడా ఏవీ సుబ్బారెడ్డి తన సత్తా చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్గత సమావేశాలకు.. బొండా ఉమాని కూడా ఆహ్వానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి తానే పోటీకి దిగుతానని ఏవీ సుబ్బారెడ్డి చెప్పేస్తున్నారు. అయితే.. పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వకుండా.. వేచి చూస్తున్నారు. వీరిలో ఎవరికి ఇస్తే.. పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుందనే విషయాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా ఆళ్ల గడ్డ టికెట్ కోసం.. పోరాటం మాత్రం మామూలుగా లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 6, 2023 5:58 pm
దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు…
ఓ వైపు పాకిస్తాన్ కుట్రపూరిత వ్యూహాలు, మరోవైపు ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద దాడులు… వెరసి నిత్యం భారత…
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.. ఒకప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్లు ఈ మాట చెప్పేవారు. ఐతే గతంలో సినిమాల్లోకి రావాలంటే…
వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయకులు, అప్పట్లో వైసీపీకి అనుకూలంగా…
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఏపీ మద్యం…
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…