“దాదాపు 3.5 ఎకరాల్లో ఉండాల్సిన కొండ. కానీ.. ఇప్పుడు పావు ఎకరంలోపే ఉంది. దీని చుట్టూ తవ్వకాలు జరిగిపోయాయి. మట్టి, రాళ్లు వంటివి తరలించేశారు. అసలు.. మరో నెల రోజులు గడిస్తే.. ఇక్కడ ఒక కొండ ఉండేది-అని స్థానికులు చెప్పుకొనే పరిస్తితికి వచ్చేసింది. ఇదీ.. సైకో జగన్ పాలన “-అని టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు.
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం యువగళం పాదయాత్ర గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న వినుకొండలో సాగుతోంది. ఇక్కడి ఈపూరు మండలం, పుచ్చకాయలబోడు గ్రామానికి సరిహద్దులో భారీ కొండ ఉంది. ఇది సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని స్థానికులు తెలిపారు. అయితే.. ఇప్పుడు అది కుంచించుకుపోయి.. మూడున్నర నుంచి పావు ఎకరంలోపునకు వచ్చింది. ఇదే విషయాన్ని ఈ మార్గంలో పాదయాత్ర చేసిన నారా లోకేష్ గుర్తించి.. సెల్ఫీ తీసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. “పెద్దనేత విశాఖలోని రుషి కొండనే కొట్టేయగా లేంది.. పిల్లనేతలు.. చిన్న చిన్న కొండలను అనకొండలుగా మింగేస్తున్నారు. ఇక్కడ కొండ ఇప్పుడు బోడి కొండ అయిపోయింది. దీనిని ఎవరు మింగేశారు? దీనికి బాధ్యులు ఎవరు?” అని ఆయన నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన అనుచరులు మింగేయగా.. ఈ ముక్క మిగిలిందంటూ.. సెల్పీ తీసుకుని.. సీఎం జగన్కు ఛాలెంజ్ విసిరారు.
రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…