Political News

3 ఎక‌రాల కొండ‌.. పావు ఎక‌రానికి… నారా లోకేష్

“దాదాపు 3.5 ఎక‌రాల్లో ఉండాల్సిన కొండ‌. కానీ.. ఇప్పుడు పావు ఎక‌రంలోపే ఉంది. దీని చుట్టూ త‌వ్వ‌కాలు జ‌రిగిపోయాయి. మ‌ట్టి, రాళ్లు వంటివి త‌ర‌లించేశారు. అస‌లు.. మ‌రో నెల రోజులు గ‌డిస్తే.. ఇక్క‌డ ఒక కొండ ఉండేది-అని స్థానికులు చెప్పుకొనే ప‌రిస్తితికి వ‌చ్చేసింది. ఇదీ.. సైకో జ‌గ‌న్ పాల‌న “-అని టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో ఉన్న వినుకొండ‌లో సాగుతోంది. ఇక్క‌డి ఈపూరు మండ‌లం, పుచ్చ‌కాయ‌ల‌బోడు గ్రామానికి స‌రిహ‌ద్దులో భారీ కొండ ఉంది. ఇది సుమారు 3.5 ఎక‌రాల విస్తీర్ణంలో ఉండేద‌ని స్థానికులు తెలిపారు. అయితే.. ఇప్పుడు అది కుంచించుకుపోయి.. మూడున్న‌ర నుంచి పావు ఎక‌రంలోపున‌కు వ‌చ్చింది. ఇదే విష‌యాన్ని ఈ మార్గంలో పాద‌యాత్ర చేసిన నారా లోకేష్ గుర్తించి.. సెల్ఫీ తీసుకున్నారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. “పెద్ద‌నేత విశాఖ‌లోని రుషి కొండ‌నే కొట్టేయ‌గా లేంది.. పిల్ల‌నేత‌లు.. చిన్న చిన్న కొండ‌ల‌ను అన‌కొండ‌లుగా మింగేస్తున్నారు. ఇక్క‌డ కొండ ఇప్పుడు బోడి కొండ అయిపోయింది. దీనిని ఎవ‌రు మింగేశారు? దీనికి బాధ్యులు ఎవ‌రు?” అని ఆయ‌న నిల‌దీశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు, ఆయ‌న అనుచరులు మింగేయ‌గా.. ఈ ముక్క మిగిలిందంటూ.. సెల్పీ తీసుకుని.. సీఎం జ‌గ‌న్‌కు ఛాలెంజ్ విసిరారు.

This post was last modified on August 5, 2023 10:15 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

2 minutes ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

7 minutes ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

12 minutes ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

2 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

2 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

4 hours ago