తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడి కేటీఆర్ ల్యాబీ ముందు నేతలు క్యూ కడుతున్నారు. కేటీఆర్తో మాట్లాడేందుకు గంటలు గంటలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో సీఎం కేసీఆర్ తర్వాత కీలక నాయకుడు ఎవరంటే ఎక్కువగా వినిపించే పేరు కేటీఆర్. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్న ఆయన.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు చూస్తూనే, ఐటీ మంత్రిగా ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ ఆశిస్తున్న నేతలు, వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు.. ఇప్పుడు కేటీఆర్ దర్శనం కోసం ఎగబడుతున్నారని తెలిసింది.
కేటీఆర్ చెబితే టికెట్ దక్కడం పక్కా అనే అభిప్రాయం పార్టీ నేతల్లో నెలకొంది. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్.. ఇక్కడ రాష్ట్రంలో కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీంతో కేటీఆర్తో మాట్లాడేందుకు నేతలు భారీగా తరలి వస్తున్నారు.
ఇలా వస్తున్న నేతల సంఖ్యను చూసి కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో తన ల్యాబీకి కేటీఆర్ వెళ్లేటప్పటికే భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు అక్కడ వేచి చూస్తున్నారు. దీంతో వీళ్లందరూ ఎందుకు వచ్చారు, ఎవరు రానిచ్చారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
తన కోసం వచ్చిన నేతల్లో కొందరిని పిలిపించుకుని కేటీఆర్ మాట్లాడినట్లు సమాచారం. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చే విషయం, అసంతృప్తి నేతలను బుజ్జగించే పనులతో కేటీఆర్ బిజీగా గడిపినట్లు తెలిసింది. ఇలా మొత్తానికి కేటీఆర్ కరుణ కోసం నాయకులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారని టాక్.
This post was last modified on August 5, 2023 9:08 pm
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…