ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది. అయితే ఈ బిల్లు వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం దాగి ఉందని తెలుస్తోంది. ఏ రకంగా చూసినా ఈ బిల్లుతో కేసీఆర్కే ప్రయోజనమే కలిగే అవకాశాలు ఉన్నాయి. మూడో సారి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న కేసీఆర్.. ఆర్టీసీ బిల్లుతో మాస్టర్ ప్లానే వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు 40 వేలకు పైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల ఓట్లు తిప్పుకోవడంతో పాటు గవర్నర్ను, ఆపై బీజేపీని ఇరకాటంలో పెట్టడం కేసీఆర్ ప్లాన్గా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారు. దీనిపై బిల్లును గవర్నర్కు పంపించారు. కానీ బిల్లులో మరింత స్పష్టత రావాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయని.. మరిన్ని వివరాలు పంపించాలంటూ సీఎస్ను గవర్నర్ అడిగారు. మరోవైపు గవర్నర్ బిల్లు ఆమోదం విషయంలో ఆలస్యం చేయడంతో ఆర్టీసీ కార్మికులు రాజ్భవన్ ముందు ధర్నాకు దిగారు.
ఈ బిల్లు పాసై ఎన్నికలకు ముందే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే అప్పుడు ఈ కార్మికులు ఓట్లు బీఆర్ఎస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరగక.. గవర్నర్ బిల్లును పెండింగ్లో పెడితే అప్పుడు గవర్నర్ మీదకు తోసేయొచ్చు. అంతే కాకుండా బీజేపీని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయొచ్చు. పైగా ఇప్పటికే విలీనం చేస్తామని ప్రకటించామని, బిల్లు కూడా రూపొందించామని మళ్లీ అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేస్తామని బీఆర్ఎస్ ఆశ చూపొచ్చు. ఇలా ఒక్క బిల్లు వెనుక కేసీఆర్కు కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on August 5, 2023 2:34 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…