సీఎం వైఎస్ జగన్ సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేరంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. బాబాయి వివేకా హత్య కేసులో వైఎస్ సునీత న్యాయపోరాటం చేస్తుంటే…జగన్ మాత్రం అవినాష్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రం దగ్గర చేతులు కట్టుకు నిలుచుంటున్నారని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక, సొంత చెల్లి షర్మిలను తెలంగాణకు పరిమితం చేసి, ఆమెతో పాటు తల్లి విజయమ్మను కూడా జగన్ పార్టీనుంచి సాగనంపారని ట్రోల్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి వైఎస్సార్ ఫోటో కావాలని, కానీ, ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మికి మాత్రం పార్టీలో సభ్యత్వం లేదని దుయ్యబట్టారు.
ఇంతకంటే మోసం ఎక్కడా ఉండదని, వైసీపీ ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా తయారైందని విమర్శించారు. రాష్ట్ర సంపదను జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క చాన్స్ అంటూ అన్ని వర్గాల గొంతు కోసిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు.
వైసీపీ పుట్టుకే మోసపూరిత ఆలోచన అని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. వైఎస్సార్ది ఏ పార్టీ? జగన్ది ఏ పార్టీ? అని కన్నా నిలదీశారు. వైఎస్ఆర్ సోదరుడు వివేకా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారన్న కారణంతో ఆయనను చంపించారని ఆరోపించారు. జగన్ సీఎం అయితే సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉంటుందని ముందు చెప్పింది తానేనని, ఇప్పుడు తాను చెప్పినట్లే జరుగుతోందని కన్నా అన్నారు.
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…