Political News

వైసీపీకి వైఎస్ఆర్ ముద్దు..విజయమ్మ వద్దు?

సీఎం వైఎస్ జగన్ సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేరంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. బాబాయి వివేకా హత్య కేసులో వైఎస్ సునీత న్యాయపోరాటం చేస్తుంటే…జగన్ మాత్రం అవినాష్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రం దగ్గర చేతులు కట్టుకు నిలుచుంటున్నారని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక, సొంత చెల్లి షర్మిలను తెలంగాణకు పరిమితం చేసి, ఆమెతో పాటు తల్లి విజయమ్మను కూడా జగన్ పార్టీనుంచి సాగనంపారని ట్రోల్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి వైఎస్సార్ ఫోటో కావాలని, కానీ, ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మికి మాత్రం పార్టీలో సభ్యత్వం లేదని దుయ్యబట్టారు.

ఇంతకంటే మోసం ఎక్కడా ఉండదని, వైసీపీ ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా తయారైందని విమర్శించారు. రాష్ట్ర సంపదను జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క చాన్స్ అంటూ అన్ని వర్గాల గొంతు కోసిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు.

వైసీపీ పుట్టుకే మోసపూరిత ఆలోచన అని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. వైఎస్సార్‌ది ఏ పార్టీ? జగన్‌ది ఏ పార్టీ? అని కన్నా నిలదీశారు. వైఎస్ఆర్ సోదరుడు వివేకా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారన్న కారణంతో ఆయనను చంపించారని ఆరోపించారు. జగన్ సీఎం అయితే సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉంటుందని ముందు చెప్పింది తానేనని, ఇప్పుడు తాను చెప్పినట్లే జరుగుతోందని కన్నా అన్నారు.

This post was last modified on August 4, 2023 11:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

46 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago