Political News

ష‌ణ్ముఖ వ్యూహంతోనే జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపుతా: ప‌వ‌న్

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు అహంకారం పెరిగిపోయింద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. ష‌ణ్ముఖ వ్యూహంతోనే ఆయ‌న‌ను గ‌ద్దె దింపుతామ‌ని చెప్పారు. ఒక దుష్ట‌నేత‌పై పోరాటం చేస్తున్నామ‌ని.. ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గుర్తుంచుకోవాల‌ని సూచించారు. తాజాగా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న నేత‌ల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా అనేక విష‌యాల‌ను ఆయ‌న పంచుకున్నారు.

నేత‌ల‌కు ఆహ్వానం
త‌న పార్టీలో చేరాల‌ని అనుకునేవారు.. ఎవ‌రైనా వ‌చ్చే చేరొచ్చ‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. అయితే.. ఎవ‌రూ ప్ర‌జ‌ల‌కు ఓటు కోసం డ‌బ్బులు పంచేందుకు వీల్లేద‌ని.. నిస్వార్థంగా ప్ర‌జ‌లకు సేవ చేయాల‌ని ఆయ‌న సూచించారు. అలాంటివారికే పార్టీలో స్థానం ఉంటుంద‌న్నారు. ప్ర‌జ‌ల నుంచికూడా డ‌బ్బులు తీసుకోరాద‌ని చెప్పారు.

“డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదు. రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఎవరూ నాయకులు కాలేరు. డబ్బుతో ఓట్లు కొనమని నేను చెప్పడం లేదు. భావితరం గురించే ఆలోచించే నేతలు.. ఇతర పార్టీల నుంచి వచ్చినా ఆహ్వానిస్తా.” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

మంగ‌ళ‌గిరిలోనే ఉంటా

తాను ఇక నుంచి మంగ‌ళ‌గిరిలోనే ఉంటాన‌ని ప‌వ‌న్ చెప్పారు. ఎప్పుడైనా సినిమా షూటింగుల‌కు వెళ్లినా.. తిరిగి తాను.. మంగ‌ళ‌గిరికే తిరిగి వ‌స్తాన‌ని చెప్పారు. త‌న‌ను ఎవ‌రూ ప్ర‌భావితం చేయ‌లేర‌న్నారు. తాను ఇక్క‌డే ఉండి పార్టీకి అవ‌స‌ర‌మైన అన్ని స‌ల‌హాలు ఇస్తాన‌ని చెప్పారు. జగన్‌ అనే ఓ దుష్ట నాయకుడిపై పోరాటం చేస్తున్నామన్నారు. నటుడిని కావడం ఒక బలం.. ఒక బరువు కూడా అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

సామాన్యుల‌కు పెద్ద‌పీట‌
“ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. సామాన్యుడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని వైసీపీ భావిస్తోంది. భయపెట్టడం, బెదిరించడమే.. వైసీపీ దృష్టిలో రాజకీయం. జనసేన నేతలకు త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. షణ్ముఖ వ్యూహంతో ఎన్నికలకు వెళ్దాం. ఏపీ అభివృద్ధి తెలంగాణకు అవసరం. ఏపీ అభివృద్ధి అయితేనే తెలంగాణకు వలసలు ఆగుతాయి. రెండు దశాబ్ధాల శ్రమ, కృషిని ఏపీకి పెట్టుబడిగా పెట్టా” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

24 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago