మరో ఏడెనిమిది మాసాల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో బీజేపీ తరఫున పోటీ చేసేది వీరే అంటూ.. ఒక జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొన్నాళ్ల కిందట.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేవారి జాబితా ఒకటి తెరమీదకి వచ్చింది. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు మాత్రం ఈ జాబితాను అప్పట్లో ఖండించారు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఇదిలావుంటే, తాజాగా తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్న అభ్యర్థుల మొదటి లిస్టు అంటూ.. బీజేపీ నేతల పేర్లతో ఓ భారీ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని ప్రకారం.. కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి అంబర్పేట, కే లక్ష్మణ్ ముషీరాబాద్, బండి సంజయ్ కరీంనగర్, సోయం బాపూరావు బోధ్, ధర్మపురి అరవింద్ ఆర్మూరు, ఈటెల రాజేందర్ గజ్వేల్, రఘునందన్ రావు…. దుబ్బాక, డీకే అరుణ…. గద్వాల్, జితేందర్ రెడ్డి… మహబూబ్ నగర్,
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక, కీలక నేత మురళీధర్ రావు వేములవాడ లేదా కూకట్పల్లి, ఎన్ ఇంద్రసేనారెడ్డి….. ఎల్బీనగర్, వివేక్….. చెన్నూరు, విజయశాంతి…. మెదక్, ఎండల లక్ష్మీనారాయణ…. నిజామాబాద్ అర్బన్, రామచంద్రరావు…. మల్కాజిగిరి, ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్…ఉప్పల్, ఆచారి….. కల్వకుర్తి, జయసుధ…. సికింద్రాబాద్, రాథోడ్ రమేష్…. ఆసిఫాబాద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి…. ఖమ్మం , బాబు మోహన్… ఆందోల్, నందీశ్వర్ గౌడ్… పటాన్ చెరువు, బూర నర్సయ్య గౌడ్… భువనగిరి, విశ్వేశ్వర్ రెడ్డి… తాండూరు, గరికిపాటి మోహన్ రావు…. వరంగల్, ఈటెల జమున.. హుజూరాబాద్, విక్రమ్ గౌడ్… గోషామహల్ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిలో రాజాసింగ్ పేరు లేకపోవడం గమనార్హం.
This post was last modified on August 3, 2023 9:10 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…