ఎవరైనా తమను వాయించమని తమ ప్రత్యర్ధులకు తమంతట తాముగా ఆయుధాలను అందిస్తారా ? తెలంగాణలో కేసీఆర్ వ్యవహారం అలాగే ఉంది చూస్తుంటే. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీనే ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. రైతులకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ నాలుగు విడతల్లో రుణమాఫీని పూర్తిచేయనున్నట్లు కూడా ప్రకటించారు.
అప్పట్లో ప్రభుత్వం అంచనా ప్రకారం రు. 27 వేల కోట్లు రుణాలను మాఫీ చేయాలి. గడచిన నాలుగేళ్ళలో ప్రభుత్వం చేసిన మాఫీ కేవలం రూ. 1205 కోట్లు మాత్రమే. అంటే చేయాల్సిన మాఫీ సుమారు 26 వేల కోట్ల రూపాయులుంది. పోయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేరకపోగా మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ప్రతి ఏడాది బడ్జెట్ లో కేటాయింపులు ఘనంగా చూపిస్తున్నారు. అయితే ఏ ఏడాది కూడా నిధులను మంజూరు చేయడం లేదు. దాంతో రుణమాఫీ అలాగే ఉండిపోయింది.
చివరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా రుణమాఫీ పై చర్చించేందుకు మంత్రులు సాహసించలేదు. క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీ పై చర్చ జరుగుతుందని, ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుంటుందని ఆశించిన లక్షలాది రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. దీన్నే కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్ద అస్త్రంగా మలచుకోబోతున్నారు. ఇపుడు ప్రతిపక్షాలకు కేసీయార్ అండ్ కో సమాధానం చెప్పకపోయినా, అసెంబ్లీ సమావేశాల్లో సమాధానం చెప్పకపోయినా ఏమీకాదు.
కానీ రేపటి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు కేసీయార్ అయినా మంత్రులు, ఎంఎల్ఏలు రైతులకు ఏమని సమాధానం చెబుతారు. ఇపుడు ప్రతిపక్షాల నోళ్ళు మూయించినట్లు రేపు ఎన్నికల సందర్భంగా రైతుల నోళ్ళు మూయించలేరు. ఎందుకంటే కేసీఆర్ హామీని నమ్ముకుని రైతులు బ్యాంకులకు వాయిదాలు కట్టడం మానేశారు. దాంతో రైతులకు కొత్తప్పులు కావాలంటే బ్యాంకులు ఇవ్వటం లేదు. ఇటు ప్రభుత్వం రుణమాఫీలు చేయక అటు బ్యాంకులు కొత్తప్పులు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్ధితి దయనీయంగా తయారైంది. అందుకనే మండిపోతున్న రైతాంగం ఎన్నికల్లో ఏమిచేస్తారనే ఆసక్తి పెరిగిపోతోంది.
This post was last modified on August 2, 2023 11:49 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…