Political News

ఆ లేడీ ఎంపీ.. కంత్రీనా?.. 28 కోట్లు కొట్టేశారా?

ఆమె మ‌హిళా పార్ల‌మెంటేరియ‌న్. పైగా.. న‌టి. ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన అధికార పార్టీ రాజ‌కీయ నాయ‌కురాలు. అయితే.. ఇప్పుడు ఆమె పేరు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇదేదో.. మంచి చేసినందుకు.. ఆద‌ర్శంగా నిలిచినందుకు కాదు.. ఏకంగా 28 కోట్ల రూపాయ‌లను ప్ర‌జ‌ల నుంచి దోచేసినందుక‌ట‌!! న‌మ్మ‌డానికి కొంత ఇబ్బందిగా ఉన్నా.. నిజ‌మేన‌ని పోలీసులు కూడా చెబుతున్నారు. ఆమెపై కేసు కూడా న‌మోదు చేశారు.

ఎవ‌రు? ఎందుకు?
ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌(టీఎంసీ) నుంచి 2019లో ఎంపీగా గెలిచారు. సినీ న‌టి.. నుస్ర‌త్ జ‌హాన్‌. అప్ప‌టి ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ కూడా ద‌క్కించుకున్నారు. అయితే.. ఆమె సొంత‌గా రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. 24 ఉత్త‌ర‌ప‌ర‌గ‌ణాల జిల్లాలో ఆమె భారీ వెంచ‌ర్‌ను వేస్తున్నాన‌ని చెప్పి.. పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. హైక్లాస్ ఫెసిలిటీల‌తో.. త్రిబుల్ బెడ్ రూం ఇళ్ల‌కు శ్రీకారం చుట్టాన‌ని..త‌క్కువ ధ‌ర‌ల‌కే త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కోసం ఈ వెంచ‌ర్ వేసిన‌ట్టు ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు.

దీంతో 429 మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఆమెను న‌మ్మారు. పైగా సినిమాలు, సీరియ‌ళ్ల‌లోనూ ఆమె క‌నిపిస్తుండ‌డంతో ఈ న‌మ్మకం మ‌రింత పెరిగింది. దీంతో రూ. 28 కోట్ల మేరకు వారంతా.. అడ్వాన్సులు చెల్లించారు. అయితే.. కాలం గ‌డిచిపోయినా.. ఇక్క‌డ ఎలాంటి వెంచ‌ర్ ప‌నులు కూడా ముందుకు సాగ‌లేదు. దీంతో బాధితులు బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఎంపీకి వ్య‌తిరేకంగా కేసులు పెట్టారు. దీనిపై గరియాహట్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. మరోవైపు ఎంపీపై అలిపోర్ కోర్టులో సైతం కేసు దాఖలు చేశారు. అయితే, ఈ అంశంపై ఎంపీ నుస్రత్ జహాన్ మౌనం వ‌హించారు.

ఎలా న‌మ్మించారంటే..

నుస్రత్ జహాన్ డైరెక్టర్గా ఉన్న కంపెనీ తక్కువ ధరకే సొంత ఇల్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చింది. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో కేవలం రూ.5.55 లక్షలకు త్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని చెప్పింది. వీటిని 2018లోగా కొనుగోలుదారులకు అందిస్తామని తెలిపింది. దీంతో దాదాపు 429 మంది సంస్థ చెప్పిన నగదును చెల్లించారు. దాదాపు 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటిని అందించలేదు. దీంతో చేసేదేమీ లేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

This post was last modified on August 1, 2023 10:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

30 minutes ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

3 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

7 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

7 hours ago

సినిమా జాతకాన్ని ఎన్నికలు మార్చేశాయి

మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…

7 hours ago

ఒక్క ట్రైలర్… వందల కోట్ల బరువు

ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…

8 hours ago