Political News

ఆ లేడీ ఎంపీ.. కంత్రీనా?.. 28 కోట్లు కొట్టేశారా?

ఆమె మ‌హిళా పార్ల‌మెంటేరియ‌న్. పైగా.. న‌టి. ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన అధికార పార్టీ రాజ‌కీయ నాయ‌కురాలు. అయితే.. ఇప్పుడు ఆమె పేరు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇదేదో.. మంచి చేసినందుకు.. ఆద‌ర్శంగా నిలిచినందుకు కాదు.. ఏకంగా 28 కోట్ల రూపాయ‌లను ప్ర‌జ‌ల నుంచి దోచేసినందుక‌ట‌!! న‌మ్మ‌డానికి కొంత ఇబ్బందిగా ఉన్నా.. నిజ‌మేన‌ని పోలీసులు కూడా చెబుతున్నారు. ఆమెపై కేసు కూడా న‌మోదు చేశారు.

ఎవ‌రు? ఎందుకు?
ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌(టీఎంసీ) నుంచి 2019లో ఎంపీగా గెలిచారు. సినీ న‌టి.. నుస్ర‌త్ జ‌హాన్‌. అప్ప‌టి ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ కూడా ద‌క్కించుకున్నారు. అయితే.. ఆమె సొంత‌గా రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. 24 ఉత్త‌ర‌ప‌ర‌గ‌ణాల జిల్లాలో ఆమె భారీ వెంచ‌ర్‌ను వేస్తున్నాన‌ని చెప్పి.. పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. హైక్లాస్ ఫెసిలిటీల‌తో.. త్రిబుల్ బెడ్ రూం ఇళ్ల‌కు శ్రీకారం చుట్టాన‌ని..త‌క్కువ ధ‌ర‌ల‌కే త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కోసం ఈ వెంచ‌ర్ వేసిన‌ట్టు ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు.

దీంతో 429 మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఆమెను న‌మ్మారు. పైగా సినిమాలు, సీరియ‌ళ్ల‌లోనూ ఆమె క‌నిపిస్తుండ‌డంతో ఈ న‌మ్మకం మ‌రింత పెరిగింది. దీంతో రూ. 28 కోట్ల మేరకు వారంతా.. అడ్వాన్సులు చెల్లించారు. అయితే.. కాలం గ‌డిచిపోయినా.. ఇక్క‌డ ఎలాంటి వెంచ‌ర్ ప‌నులు కూడా ముందుకు సాగ‌లేదు. దీంతో బాధితులు బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఎంపీకి వ్య‌తిరేకంగా కేసులు పెట్టారు. దీనిపై గరియాహట్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. మరోవైపు ఎంపీపై అలిపోర్ కోర్టులో సైతం కేసు దాఖలు చేశారు. అయితే, ఈ అంశంపై ఎంపీ నుస్రత్ జహాన్ మౌనం వ‌హించారు.

ఎలా న‌మ్మించారంటే..

నుస్రత్ జహాన్ డైరెక్టర్గా ఉన్న కంపెనీ తక్కువ ధరకే సొంత ఇల్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చింది. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో కేవలం రూ.5.55 లక్షలకు త్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని చెప్పింది. వీటిని 2018లోగా కొనుగోలుదారులకు అందిస్తామని తెలిపింది. దీంతో దాదాపు 429 మంది సంస్థ చెప్పిన నగదును చెల్లించారు. దాదాపు 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటిని అందించలేదు. దీంతో చేసేదేమీ లేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

This post was last modified on August 1, 2023 10:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

2 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

8 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

10 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

10 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

11 hours ago