Political News

మాజీ ఎంపీ రాయపాటికి ఈడీ షాక్

టీడీపీ నేత, సీనియర్ పొలిటిషన్ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తాజాగా ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ డైరెక్టర్ లతోపాటు ఆయన నివాసంలో కూడా ఈడీ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, గుంటూరులో మొత్తం తొమ్మిది చోట్ల ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ తో పాటు పాత గుంటూరులోని రాయపాటి నివాసంలో ఈడి అధికారులు హఠాత్తుగా సోదాలకు దిగారు.

రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ మొత్తం 13 బ్యాంకుల నుంచి 9 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించినట్టుగా సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగానే ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఖాతాలో నుంచి సింగపూర్ కు నగదు బదిలీ అయినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోదాలు చేపట్టారు. ఆ కంపెనీకి రాయపాటి సాంబశివరావుతో, మలినేని సాంబశివరావు, మరికొందరు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.

వాస్తవానికి 2019లోనే రాయపాటిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అప్పట్లో రాయపాటి నివాసంతో పాటు కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది. ఆ తర్వాత పలు సెక్షన్ల కింద రాయపాటితో పాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాసరావులను కూడా సీబీఐ అధికారులు నిందితులుగా చేర్చారు. అయితే, రాజకీయ కక్షలో భాగంగానే రాయపాటి పై కేసులు నమోదు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

This post was last modified on August 1, 2023 4:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago