Political News

మాజీ ఎంపీ రాయపాటికి ఈడీ షాక్

టీడీపీ నేత, సీనియర్ పొలిటిషన్ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తాజాగా ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ డైరెక్టర్ లతోపాటు ఆయన నివాసంలో కూడా ఈడీ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, గుంటూరులో మొత్తం తొమ్మిది చోట్ల ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ తో పాటు పాత గుంటూరులోని రాయపాటి నివాసంలో ఈడి అధికారులు హఠాత్తుగా సోదాలకు దిగారు.

రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ మొత్తం 13 బ్యాంకుల నుంచి 9 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించినట్టుగా సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగానే ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఖాతాలో నుంచి సింగపూర్ కు నగదు బదిలీ అయినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోదాలు చేపట్టారు. ఆ కంపెనీకి రాయపాటి సాంబశివరావుతో, మలినేని సాంబశివరావు, మరికొందరు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.

వాస్తవానికి 2019లోనే రాయపాటిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అప్పట్లో రాయపాటి నివాసంతో పాటు కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది. ఆ తర్వాత పలు సెక్షన్ల కింద రాయపాటితో పాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాసరావులను కూడా సీబీఐ అధికారులు నిందితులుగా చేర్చారు. అయితే, రాజకీయ కక్షలో భాగంగానే రాయపాటి పై కేసులు నమోదు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

This post was last modified on August 1, 2023 4:30 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

5 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

7 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

8 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

8 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

9 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 hours ago