మరో ఎనిమిది మాసాల్లో ఎన్నికలు జరగనున్న ఏపీపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. అనేక మంది అనేక రూపాల్లో తమ తమ సర్వేలు వివరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నాయకుడు రఘురామకృష్ణరాజు ఏపీలో ఓట్లు-సీట్లపై హాట్ కామెంట్లు చేశారు. ఏపీలో వైసీపీ సర్కారుపై మైనారిటీ ముస్లింలు విశ్వాసం కోల్పోయారని.. దీంతో వీరి ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో వైఎస్ను చూసి మైనారిటీలు వైసీపీవైపు మొగ్గు చూపారని చెప్పారు. కానీ, ఇప్పుడు జగన్ చేజేతులా వారిని దూరం చేసుకున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి వైసీపీ కష్టాలు తప్పేలా లేవు. లోక్ సభ ఎన్నికల్లో గత ఎన్నికల్లో 22 చోట్ల గెలిచాం. కానీ, ఇప్పుడు 4, 5 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదు. 2009లో కాంగ్రెస్ విజయం సాధించింది. తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్తా వైఎస్సార్సీపీగా మారింపోయింది. గతంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు వైసీపీకి వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని వివరించారు.
6 శాతం కట్!
రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఎంతో ఓటు బ్యాంకు వచ్చిందని చెప్పుకొన్న వైసీపీనాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కోత పెట్టనున్నారని ఎంపీ రఘురామ అన్నారు. ఇప్పుడు 6 శాతం మేర ఓట్లు వైసీపీకి పడే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. ముస్లిం, మైనార్టీ ఓట్లు గతంలో వైఎస్ను చూసి వేశారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలు వైసీపీ వైపు లేరని వ్యాఖ్యానించారు. ఆ ఓట్లన్నీ తిరిగి కాంగ్రెస్కు పడినా ఆశ్చర్యం లేదని అన్నారు. అయితే.. అంత మాత్రాన కాంగ్రెస్ గెలుస్తుందని కాదన్నారు.
కడప, రాజంపేట పోతాయి!
మిశ్రమ ఫలితాలకు కేంద్రంగా ఉన్న రాజంపేట, కడప పార్లమెంటు సీట్లపైనా రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కడప, రాజంపేట వైసీపీకి దక్కే అవకాశం లేదని.. తన మిత్రులు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీలలో కొంత శాతం మార్పు కనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అసెంబ్లీ 40 సీట్లు, పార్లమెంటులో 4 నుంచి 6 సీట్లు మాత్రమే దక్కుతాయని ఆయన జోస్యం చెప్పారు. అందుకే కీలక నేతలు మౌనంగా ఉన్నారని చెప్పుకొచ్చారు..
This post was last modified on July 28, 2023 9:04 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…