Political News

ఏపీలో ఓట్లు-సీట్ల‌పై ర‌ఘురామ లెక్క ఇదీ!

మ‌రో ఎనిమిది మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అనేక మంది అనేక రూపాల్లో త‌మ త‌మ స‌ర్వేలు వివ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఏపీలో ఓట్లు-సీట్ల‌పై హాట్ కామెంట్లు చేశారు. ఏపీలో వైసీపీ స‌ర్కారుపై మైనారిటీ ముస్లింలు విశ్వాసం కోల్పోయార‌ని.. దీంతో వీరి ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. గ‌తంలో వైఎస్‌ను చూసి మైనారిటీలు వైసీపీవైపు మొగ్గు చూపార‌ని చెప్పారు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ చేజేతులా వారిని దూరం చేసుకున్నార‌ని అన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మా పార్టీకి వైసీపీ కష్టాలు తప్పేలా లేవు. లోక్ సభ ఎన్నికల్లో గ‌త ఎన్నిక‌ల్లో 22 చోట్ల గెలిచాం. కానీ, ఇప్పుడు 4, 5 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదు. 2009లో కాంగ్రెస్ విజయం సాధించింది. త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్తా వైఎస్సార్సీపీగా మారింపోయింది. గతంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు వైసీపీకి వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని వివ‌రించారు.

6 శాతం క‌ట్‌!

రాష్ట్రంలో గ‌త ఎన్నిక‌ల్లో ఎంతో ఓటు బ్యాంకు వ‌చ్చింద‌ని చెప్పుకొన్న వైసీపీనాయ‌కుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కోత పెట్ట‌నున్నార‌ని ఎంపీ ర‌ఘురామ అన్నారు. ఇప్పుడు 6 శాతం మేర ఓట్లు వైసీపీకి ప‌డే అవ‌కాశం లేకుండా పోయింద‌ని చెప్పారు. ముస్లిం, మైనార్టీ ఓట్లు గ‌తంలో వైఎస్‌ను చూసి వేశార‌ని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలు వైసీపీ వైపు లేర‌ని వ్యాఖ్యానించారు. ఆ ఓట్ల‌న్నీ తిరిగి కాంగ్రెస్‌కు ప‌డినా ఆశ్చ‌ర్యం లేద‌ని అన్నారు. అయితే.. అంత మాత్రాన కాంగ్రెస్ గెలుస్తుంద‌ని కాద‌న్నారు.

కడప, రాజంపేట పోతాయి!

మిశ్ర‌మ ఫ‌లితాల‌కు కేంద్రంగా ఉన్న రాజంపేట‌, క‌డ‌ప పార్లమెంటు సీట్ల‌పైనా రఘురామ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో కడప, రాజంపేట వైసీపీకి ద‌క్కే అవ‌కాశం లేద‌ని.. త‌న మిత్రులు చెబుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీల‌లో కొంత శాతం మార్పు కనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అసెంబ్లీ 40 సీట్లు, పార్ల‌మెంటులో 4 నుంచి 6 సీట్లు మాత్ర‌మే ద‌క్కుతాయ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. అందుకే కీల‌క నేత‌లు మౌనంగా ఉన్నార‌ని చెప్పుకొచ్చారు..

This post was last modified on July 28, 2023 9:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్లమ్ డాగ్ మేలుకుంటే బాగుండేది

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…

4 hours ago

చరణ్ క్లారిటీ ఇస్తేనే చిరు బయటపడేది

మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…

6 hours ago

ఫ్రెష్షుగా టార్గెట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్

స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…

6 hours ago

అలాంటి మ్యాజిక్.. ఇంకోసారి సాధ్యమేనా?

గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…

7 hours ago

జననాగయన్ లీక్ వెనుక..

ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…

9 hours ago

గాడ్ ఆఫ్ వార్… ఏదో ఒకటి తేలిపోవాలి

గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…

9 hours ago