Political News

ఏపీలో ఓట్లు-సీట్ల‌పై ర‌ఘురామ లెక్క ఇదీ!

మ‌రో ఎనిమిది మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అనేక మంది అనేక రూపాల్లో త‌మ త‌మ స‌ర్వేలు వివ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఏపీలో ఓట్లు-సీట్ల‌పై హాట్ కామెంట్లు చేశారు. ఏపీలో వైసీపీ స‌ర్కారుపై మైనారిటీ ముస్లింలు విశ్వాసం కోల్పోయార‌ని.. దీంతో వీరి ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. గ‌తంలో వైఎస్‌ను చూసి మైనారిటీలు వైసీపీవైపు మొగ్గు చూపార‌ని చెప్పారు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ చేజేతులా వారిని దూరం చేసుకున్నార‌ని అన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మా పార్టీకి వైసీపీ కష్టాలు తప్పేలా లేవు. లోక్ సభ ఎన్నికల్లో గ‌త ఎన్నిక‌ల్లో 22 చోట్ల గెలిచాం. కానీ, ఇప్పుడు 4, 5 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదు. 2009లో కాంగ్రెస్ విజయం సాధించింది. త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్తా వైఎస్సార్సీపీగా మారింపోయింది. గతంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు వైసీపీకి వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని వివ‌రించారు.

6 శాతం క‌ట్‌!

రాష్ట్రంలో గ‌త ఎన్నిక‌ల్లో ఎంతో ఓటు బ్యాంకు వ‌చ్చింద‌ని చెప్పుకొన్న వైసీపీనాయ‌కుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కోత పెట్ట‌నున్నార‌ని ఎంపీ ర‌ఘురామ అన్నారు. ఇప్పుడు 6 శాతం మేర ఓట్లు వైసీపీకి ప‌డే అవ‌కాశం లేకుండా పోయింద‌ని చెప్పారు. ముస్లిం, మైనార్టీ ఓట్లు గ‌తంలో వైఎస్‌ను చూసి వేశార‌ని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలు వైసీపీ వైపు లేర‌ని వ్యాఖ్యానించారు. ఆ ఓట్ల‌న్నీ తిరిగి కాంగ్రెస్‌కు ప‌డినా ఆశ్చ‌ర్యం లేద‌ని అన్నారు. అయితే.. అంత మాత్రాన కాంగ్రెస్ గెలుస్తుంద‌ని కాద‌న్నారు.

కడప, రాజంపేట పోతాయి!

మిశ్ర‌మ ఫ‌లితాల‌కు కేంద్రంగా ఉన్న రాజంపేట‌, క‌డ‌ప పార్లమెంటు సీట్ల‌పైనా రఘురామ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో కడప, రాజంపేట వైసీపీకి ద‌క్కే అవ‌కాశం లేద‌ని.. త‌న మిత్రులు చెబుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీల‌లో కొంత శాతం మార్పు కనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అసెంబ్లీ 40 సీట్లు, పార్ల‌మెంటులో 4 నుంచి 6 సీట్లు మాత్ర‌మే ద‌క్కుతాయ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. అందుకే కీల‌క నేత‌లు మౌనంగా ఉన్నార‌ని చెప్పుకొచ్చారు..

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

1 hour ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

2 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

3 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

5 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

11 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

12 hours ago