అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ఆంధ్రప్రదేశ్లో జనసేన దూకుడు ప్రదర్శిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఆ పార్టీ సాగుతోంది. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. ఎన్నికల్లో టీడీపీతోనూ కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఎలా అనే ప్రశ్నలు కలుగుతున్నాయి. కానీ జనసేన మాత్రం తాను కోరుకున్న నియోజకవర్గాల్లో కచ్చితంగా పోటీ చేసేలా కనిపిస్తోంది. ఇందులో తిరుపతి నియోజకవర్గంపై జనసేన ప్రత్యేక దృష్టి సారించింది.
తప్పక గెలుస్తామని జనసేన ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో తిరుపతి ఒకటి. 2009లో ప్రజారాజ్యం తరపున చిరంజీవి ఇక్కడి నుంచే గెలిచారు. పవన్ కల్యాణ్ సామాజిక వర్గం ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. దీంతో విజయంపై జనసేన ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో అధినేత పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన కోస్తా నుంచే బరిలో దిగనున్నారని వారాహి యాత్రతో తేలిపోయింది. ఇక తిరుపతి ఎవరికి? అనే ప్రశ్న మొదలైంది.
పవన్ పోటీ చేయకపోతే తిరుపతి టికెట్ తనకు దక్కుతుందని కిరణ్ రాయల్ అంటున్నారు. కానీ ఆయనపై అవినీతి ఆరోపణలున్నాయని వ్యతిరేక వర్గం చెబుతోంది. దీంతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్కే కచ్చితంగా టికెట్ వస్తుందని ఆయన అనుచర వర్గం పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టింది. వచ్చే ఎన్నికల్లో హరిప్రసాద్ నిలబడడంతో పాటు గెలుస్తారని సామాజిక మాధ్యమాలను ప్రచారంతో ఉపేస్తున్నారు. ప్రస్తుత పరిణామలు చూస్తుంటే ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. మరి పవన్ మనుసులో ఏముందో? తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
This post was last modified on July 26, 2023 4:58 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…