Political News

జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి: అంబటి

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్‌కు భయం అంటే ఏంటో పరిచయం చేస్తా అంటూ లోకేష్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ పై మంత్రి అంబటి రాంబాబు ప్రతి విమర్శలు గుప్పించారు. జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి రచించిన ‘అల్లుడు సుద్దులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి పట్టిన శని లోకేష్‌ అని, లోకేష్‌ పేరు మీద టీడీపీ గంగలో కలిసిపోతుందని ఎద్దేవా చేశారు.

లక్ష్మీపార్వతి భుజంపై తుపాకీ పెట్టి ఎన్టీఆర్ ను బాబు కాల్చేశారని ఆరోపించారు. చంద్రబాబు పూర్తి నిజస్వరూపం లక్ష్మీపార్వతికి తెలియకపోయినా…ఆయన బావమరిదికి తెలుసంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. బంధుత్వాలను, డబ్బును వాడుకుని రాజకీయాల్లోకి చంద్రబాబు వచ్చారని ఆరోపించారు. ఎన్టీఆర్ భోళాశంకరుడని, ఎవరిని నిలబెట్టైనా గెలిపించగల సమర్థుడని, ఆ లక్షణం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి, జగన్‌ కు వచ్చిందని వెల్లడించారు. అధికారం కోసం బాబు ఎవరితో అయినా కలుస్తాడని, ఆయన దత్తపుత్రుడు కూడా అందరితో కలిశాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ నానా గడ్డి కరుస్తున్నాడని సెటైర్లు వేశారు.

ఏదోలా ప్యాంటు షర్డు వేసి లోకేష్ ని సీటులో కూర్చోబెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ తో చేరి దత్తపుత్రుడు (పవన్‌ కల్యాణ్‌) పాడైపోతున్నాడని, రోజుకు 2 కోట్లు సంపాదించే పవన్.. ట్యాక్స్ కడుతున్నాడో లేదో? అని అనుమానం వ్యక్తం చేశారు. మావాడు సీఎం అవుతాడనని మా కులపోళ్లు అనుకుంటున్నారని, కానీ, పవన్ నాశనం అవ్వడమే కాకుండా సినిమా పిచ్చితో ఉన్న యువకులను నాశనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో పవన్ పై కూడా పుస్తకం రాసి ఆయనకు పంపించాలని లక్ష్మీపార్వతిని కోరారు.

This post was last modified on July 26, 2023 8:46 am

Share
Show comments

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago