టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ను చుట్టేస్తున్నారు. వర్షంలోనూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో ఆయన ప్రదర్శించిన ఓ ఎర్ర రంగు అట్టతో ఉన్న పుస్తకం చర్చనీయాంశంగా మారింది. ఆ రెడ్బుక్ ఏమిటీ? అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై ఎట్టకేలకు లోకేష్ సమాధానమిచ్చారు. ఆ రెడ్బుక్ గుట్టు ఏమిటో బయటపెట్టారు.
ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న జగన్ మెప్పు పొందేందుకు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి, చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న వారందరి పేర్లు ఈ రెడ్బుక్లో రాస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్బుక్లో నమోదు చేసిన అందరిపై న్యాయపరమైన విచారణ జరిపిస్తామని లోకేష్ చెప్పారు. బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామన్నారు. సీఎం కోసం నిబంధనలను ఉల్లంఘిస్తున్న అధికారుల లెక్కతేల్చే పుస్తకమే ఇది అని బహిరంగ సభలో ఈ రెడ్బుక్ను చూపించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన సభలో లోకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఆయన ఇప్పటివరకూ ఎంతమంది పేర్లు నమోదు చేశారో? అసలు టీడీపీ అధికారంలోకి వస్తుందా? అని వైసీసీ వర్గాలు వెటకారంగా మాట్లాడుతున్నాయి.
This post was last modified on July 25, 2023 5:17 pm
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…