Political News

ఓ.. లోకేష్ రెడ్‌బుక్ సంగ‌తి అదా!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్.. యువగ‌ళం పాద‌యాత్ర‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను చుట్టేస్తున్నారు. వ‌ర్షంలోనూ పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. ఈ యాత్ర‌లో ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన ఓ ఎర్ర రంగు అట్ట‌తో ఉన్న పుస్త‌కం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ రెడ్‌బుక్ ఏమిటీ? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. దీనిపై ఎట్ట‌కేల‌కు లోకేష్ స‌మాధాన‌మిచ్చారు. ఆ రెడ్‌బుక్ గుట్టు ఏమిటో బ‌య‌ట‌పెట్టారు.

ముఖ్య‌మంత్రి పీఠంపై ఉన్న జ‌గ‌న్ మెప్పు పొందేందుకు కొంద‌రు అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని లోకేష్  ఆరోపించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి, చ‌ట్టాల‌ను చేతుల్లోకి తీసుకుంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. తమ కార్య‌క‌ర్త‌ల‌పై త‌ప్పుడు కేసులు న‌మోదు చేస్తున్నార‌ని చెప్పారు. ఇలా ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తూ.. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న వారంద‌రి పేర్లు ఈ రెడ్‌బుక్‌లో రాస్తున్న‌ట్లు లోకేష్ వెల్ల‌డించారు.

టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ రెడ్‌బుక్‌లో న‌మోదు చేసిన అంద‌రిపై న్యాయ‌ప‌ర‌మైన విచార‌ణ జ‌రిపిస్తామ‌ని లోకేష్ చెప్పారు. బాధ్యుల‌ను త‌ప్ప‌కుండా శిక్షిస్తామ‌న్నారు. సీఎం కోసం నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్న అధికారుల లెక్కతేల్చే పుస్త‌క‌మే ఇది అని బ‌హిరంగ స‌భ‌లో ఈ రెడ్‌బుక్‌ను చూపించారు. ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తిలో జ‌రిగిన స‌భ‌లో లోకేష్ ఈ విషయాన్ని వెల్ల‌డించారు. మ‌రి ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ ఎంత‌మంది పేర్లు న‌మోదు చేశారో? అస‌లు టీడీపీ అధికారంలోకి వ‌స్తుందా? అని వైసీసీ వ‌ర్గాలు వెట‌కారంగా మాట్లాడుతున్నాయి. 

This post was last modified on July 25, 2023 5:17 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

39 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago