వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంతకాలంగా చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాలలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతిలోని వెంకటపాలెంలో జరిగిన ఆర్5 జోన్ ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభలో పవన్ పై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు భార్యలను మార్చడం, పార్టీలను తార్చడం తప్ప ఏమీ తెలీదని జోగి రమేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. పవన్ ఓ పిచ్చికుక్క అంటూ సంచలన విమర్శలు గుప్పించారు జోగి. పవన్ పెళ్లాలనే కాదు.. పార్టీలనూ మారుస్తాడంటూ విరుచుకుపడ్డారు.
మార్చటం, తార్చటం పవన్ కల్యాణ్ వెన్నతో పెట్టిన విద్య అని విమర్శలు గుప్పించారు. కుక్కలకు చిత్త కార్తె సీజన్ ఉంటుందని, ఆ టైంలో రోడ్డుపైకి కుక్కలు ఎక్కువగా వచ్చి మొరగడం వంటి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయని, ఆ తరహాలోనే పవన్ వంటి చిత్త కార్తె కుక్కలు ఎన్నికల సీజన్ లో రోడ్లమీదకు వచ్చి అరుస్తున్నాయని షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబు ముసలి నక్క , పవన్ కల్యాణ్ పిచ్చికుక్క అని దుయ్యబట్టారు. ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై కూడా జోగి విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో విగ్గు రాజుతో కలిసి ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలో కంపెనీ పెట్టు అంటూ పవన్ పై జోగి సెటైర్లు వేశారు. సీఎం జగన్ పేదలకు అన్నం పెడుతున్నాడని, గూడు కల్పిస్తున్నాడని, జగన్ ను ఎవరూ టచ్ చేయలేరని అన్నారు జోగి రమేష్. జగన్ వెంట్రుక కూడా పీకలేరంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఊరపంది తిరిగినట్లు ఒకడు రోడ్ల పై తిరుగుతున్నాడు అంటూ లోకేష్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరి, జోగి రమేష్ వ్యాఖ్యలపై పవన్, జనసేన నేతల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 24, 2023 7:12 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…