వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంతకాలంగా చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాలలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతిలోని వెంకటపాలెంలో జరిగిన ఆర్5 జోన్ ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభలో పవన్ పై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు భార్యలను మార్చడం, పార్టీలను తార్చడం తప్ప ఏమీ తెలీదని జోగి రమేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. పవన్ ఓ పిచ్చికుక్క అంటూ సంచలన విమర్శలు గుప్పించారు జోగి. పవన్ పెళ్లాలనే కాదు.. పార్టీలనూ మారుస్తాడంటూ విరుచుకుపడ్డారు.
మార్చటం, తార్చటం పవన్ కల్యాణ్ వెన్నతో పెట్టిన విద్య అని విమర్శలు గుప్పించారు. కుక్కలకు చిత్త కార్తె సీజన్ ఉంటుందని, ఆ టైంలో రోడ్డుపైకి కుక్కలు ఎక్కువగా వచ్చి మొరగడం వంటి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయని, ఆ తరహాలోనే పవన్ వంటి చిత్త కార్తె కుక్కలు ఎన్నికల సీజన్ లో రోడ్లమీదకు వచ్చి అరుస్తున్నాయని షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబు ముసలి నక్క , పవన్ కల్యాణ్ పిచ్చికుక్క అని దుయ్యబట్టారు. ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై కూడా జోగి విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో విగ్గు రాజుతో కలిసి ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలో కంపెనీ పెట్టు అంటూ పవన్ పై జోగి సెటైర్లు వేశారు. సీఎం జగన్ పేదలకు అన్నం పెడుతున్నాడని, గూడు కల్పిస్తున్నాడని, జగన్ ను ఎవరూ టచ్ చేయలేరని అన్నారు జోగి రమేష్. జగన్ వెంట్రుక కూడా పీకలేరంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఊరపంది తిరిగినట్లు ఒకడు రోడ్ల పై తిరుగుతున్నాడు అంటూ లోకేష్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరి, జోగి రమేష్ వ్యాఖ్యలపై పవన్, జనసేన నేతల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 24, 2023 7:12 pm
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…