వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంతకాలంగా చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాలలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతిలోని వెంకటపాలెంలో జరిగిన ఆర్5 జోన్ ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభలో పవన్ పై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు భార్యలను మార్చడం, పార్టీలను తార్చడం తప్ప ఏమీ తెలీదని జోగి రమేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. పవన్ ఓ పిచ్చికుక్క అంటూ సంచలన విమర్శలు గుప్పించారు జోగి. పవన్ పెళ్లాలనే కాదు.. పార్టీలనూ మారుస్తాడంటూ విరుచుకుపడ్డారు.
మార్చటం, తార్చటం పవన్ కల్యాణ్ వెన్నతో పెట్టిన విద్య అని విమర్శలు గుప్పించారు. కుక్కలకు చిత్త కార్తె సీజన్ ఉంటుందని, ఆ టైంలో రోడ్డుపైకి కుక్కలు ఎక్కువగా వచ్చి మొరగడం వంటి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయని, ఆ తరహాలోనే పవన్ వంటి చిత్త కార్తె కుక్కలు ఎన్నికల సీజన్ లో రోడ్లమీదకు వచ్చి అరుస్తున్నాయని షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబు ముసలి నక్క , పవన్ కల్యాణ్ పిచ్చికుక్క అని దుయ్యబట్టారు. ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై కూడా జోగి విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో విగ్గు రాజుతో కలిసి ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలో కంపెనీ పెట్టు అంటూ పవన్ పై జోగి సెటైర్లు వేశారు. సీఎం జగన్ పేదలకు అన్నం పెడుతున్నాడని, గూడు కల్పిస్తున్నాడని, జగన్ ను ఎవరూ టచ్ చేయలేరని అన్నారు జోగి రమేష్. జగన్ వెంట్రుక కూడా పీకలేరంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఊరపంది తిరిగినట్లు ఒకడు రోడ్ల పై తిరుగుతున్నాడు అంటూ లోకేష్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరి, జోగి రమేష్ వ్యాఖ్యలపై పవన్, జనసేన నేతల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 24, 2023 7:12 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…