Political News

ర‌మేష్ హాస్పిట‌ల్ ఎండీ లైన్లోకొచ్చాడు

విజ‌య‌వాడ స్వ‌ర్ణ ప్యాలెస్‌లోని ర‌మేష్ కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో కొన్ని రోజుల కింద‌ట భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగి 12 మంది ప్రాణాలు కోల్పోవ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు ఆసుప‌త్రి సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐతే హాస్పిట‌ల్ ఎండీ ర‌మేష్ బాబు మాత్రం అదృశ్య‌మ‌య్యారు. ఆయ‌న కోసం కొన్ని ప్ర‌త్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాతి రోజు అండ‌ర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు ర‌మేష్ బాబు. ఇప్పుడాయ‌న ఈ ఉదంతంపై ఓ ఆడియో సందేశాన్ని మీడియాకు విడుద‌ల చేశారు.

అగ్నిప్రమాద ఘటనపై విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని రమేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఘటనాస్థలిలో లేకున్నప్ప‌టికీ డాక్టర్‌ రాజగోపాల్‌, డాక్టర్‌ సుదర్శన్‌ల‌ను పోలీసులు నిర్బంధించడం సరికాదని.. అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమ‌ని ఆయ‌నన్నారు. ఘటన జరిగిన రోజు నాడు తాను, ఆ డాక్టర్లు క‌లిసి కలెక్టర్‌ ఆఫీసులో కలెక్టర్‌ సమక్షంలో విచారణలో పాల్గొన్నామ‌ని ఆయ‌న తెలిపారు. త‌మ‌ ఆస్పత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవమ‌ని.. నిష్పక్షపాత న్యాయవిచారణకు ఆస్పత్రి యాజమాన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ర‌మేష్ బాబు చెప్పారు.

త‌మ ఆసుప‌త్రిలో పది లక్షల మందికిపైగా హృద్రోగ చికిత్సలు చేయించుకున్నారని.. ఐదు వేల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు..త‌న‌ పేరు డాక్టర్‌ రమేశ్ ‌బాబు అని.. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు అందులో బాబుని తీసేసి చౌదరి అని తగిలించడం త‌న‌కెంతో బాధ కలిగించింద‌ని.. వైద్యానికి కుల, మత, రాజకీయాలను ఆపాదించడం సమంజసం కాద‌ని అన్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించాక.. చాలా మంది క్రిటికల్‌ స్టేజ్‌లో ఉన్న బాధితులు కూడా త‌మ‌ వైద్యసేవలతో కోలుకుని ఇళ్లకు వెళ్లారని. అయితే అనుహ్యంగా అగ్నిప్రమాద ఘటనతో త‌మ‌ ప్రయత్నాలన్నీ నిష్పలమయ్యాయని రమేశ్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

This post was last modified on August 15, 2020 9:12 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago