Political News

ర‌మేష్ హాస్పిట‌ల్ ఎండీ లైన్లోకొచ్చాడు

విజ‌య‌వాడ స్వ‌ర్ణ ప్యాలెస్‌లోని ర‌మేష్ కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో కొన్ని రోజుల కింద‌ట భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగి 12 మంది ప్రాణాలు కోల్పోవ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు ఆసుప‌త్రి సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐతే హాస్పిట‌ల్ ఎండీ ర‌మేష్ బాబు మాత్రం అదృశ్య‌మ‌య్యారు. ఆయ‌న కోసం కొన్ని ప్ర‌త్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాతి రోజు అండ‌ర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు ర‌మేష్ బాబు. ఇప్పుడాయ‌న ఈ ఉదంతంపై ఓ ఆడియో సందేశాన్ని మీడియాకు విడుద‌ల చేశారు.

అగ్నిప్రమాద ఘటనపై విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని రమేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఘటనాస్థలిలో లేకున్నప్ప‌టికీ డాక్టర్‌ రాజగోపాల్‌, డాక్టర్‌ సుదర్శన్‌ల‌ను పోలీసులు నిర్బంధించడం సరికాదని.. అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమ‌ని ఆయ‌నన్నారు. ఘటన జరిగిన రోజు నాడు తాను, ఆ డాక్టర్లు క‌లిసి కలెక్టర్‌ ఆఫీసులో కలెక్టర్‌ సమక్షంలో విచారణలో పాల్గొన్నామ‌ని ఆయ‌న తెలిపారు. త‌మ‌ ఆస్పత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవమ‌ని.. నిష్పక్షపాత న్యాయవిచారణకు ఆస్పత్రి యాజమాన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ర‌మేష్ బాబు చెప్పారు.

త‌మ ఆసుప‌త్రిలో పది లక్షల మందికిపైగా హృద్రోగ చికిత్సలు చేయించుకున్నారని.. ఐదు వేల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు..త‌న‌ పేరు డాక్టర్‌ రమేశ్ ‌బాబు అని.. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు అందులో బాబుని తీసేసి చౌదరి అని తగిలించడం త‌న‌కెంతో బాధ కలిగించింద‌ని.. వైద్యానికి కుల, మత, రాజకీయాలను ఆపాదించడం సమంజసం కాద‌ని అన్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించాక.. చాలా మంది క్రిటికల్‌ స్టేజ్‌లో ఉన్న బాధితులు కూడా త‌మ‌ వైద్యసేవలతో కోలుకుని ఇళ్లకు వెళ్లారని. అయితే అనుహ్యంగా అగ్నిప్రమాద ఘటనతో త‌మ‌ ప్రయత్నాలన్నీ నిష్పలమయ్యాయని రమేశ్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

This post was last modified on August 15, 2020 9:12 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

27 minutes ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

51 minutes ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

2 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

2 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

5 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

6 hours ago